ఒకటి నుంచి ఇంటర్ వరకు దరఖాస్తుల ఆహ్వానం
40 నుంచి వంద శాతం అంధత్వం ఉన్న వారు అర్హులు
మహబూబ్నగర్ టౌన్, జూన్ 26 : జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రహదారిలోని ఉన్న ప్రభుత్వ అంధుల, ఆశ్రమ విద్యాలయంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఉచిత విద్య, భోజన వసతితోపాటు ప్రత్యేక సాప్ట్వేర్తో రూపొందించిన కంప్యూటర్తో శిక్షణ అందజేస్తున్నారు. 40 నుంచి 100 శాతం వరకు అంధత్యం ఉండి సదరం ధ్రువపత్రం ఉన్న ఆరేండ్ల నుంచి 14 ఏండ్ల బాలబాలికలు అర్హులు.
1987 నుంచి ఇప్పటివరకు సుమారు 300 మంది అంధ విద్యార్థులు ఈ పాఠశాలలో చదివి ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంటర్లో హెచ్ఈసీ గ్రూప్ అందుబాటులో ఉన్నది. విశాలమైన మైదానంతో పాటు మంచి వాతావరణంలో విద్యాలయం ఉన్నది. వివరాల కోసం 9618243794 నంబర్ను సంప్రందించాలని కళాశాల ప్రిన్సిపాల్ రాములు కోరుతున్నారు.