అచ్చంపేట, నవంబర్ 30 : గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుం చి రాష్ట్రంలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆంగ్ల బో ధన ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర గిరిజన, సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి తెలిపారు. మంగళవారం అ చ్చంపేట డివిజన్లోని అచ్చంపేట, వటువర్లపల్లి, జంగంరెడ్డిపల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, కొండనాగుల, మన్ననూరులోని గిరిజన వసతి గృహాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో వసతులు, తరగతి గదులు పరిశీలించారు. విద్యార్థులకు పాఠ్య, నోట్పుస్తకాలు, జీసీ సీ సరుకులు, ఏకరూప దుస్తులు, ప్లేట్లు, గ్లాసులు, దుప్పట్ల పంపిణీ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. గ్రామాల్లో పర్యటించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థుల సం ఖ్య, హాజరుశాతం పెంచాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జీపీఎస్ పాఠశాలల్లో ఆంగ్లబోధన అమలు చేయనున్నట్లు చెప్పారు. పాఠశాల ల్లో వసతులు సరిగ్గా లేనిచోట వాటర్ ప్లాంట్లు, ప్రహరి, విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డీఈకి సూ చించారు. పాఠ్యపుస్తకాలు కొరత లేకుండా చూడాలని డీ ఈవోకు ఫోన్లో సూచించారు. గిరిదర్శిని పుస్తకాలు మూ ల్యాంకనం చేసి గూగుల్ షీట్ అప్లోడ్ చేయాలని హె చ్ఎం, వసతి గృహ అధికారులను ఆదేశించారు. మనటీ వి, ఆర్వోప్లాంట్ సీసీ కెమెరాలు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ల్యాబ్, లైబ్రరీ సక్రమంగా నిర్వహించాలన్నారు. నాణ్యమైన భోజనం, విద్య బోధన అందించాలని ఆదేశించారు. వటువర్లపల్లి, సార్లపల్లిలలో ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట ఏటీడీవో కమలాకర్రెడ్డి, ఏహీఎంవో మల్లేశ్, ఎస్సీఆర్పీ ఆంజనేయులు పాల్గొన్నారు.