మహబూబ్నగర్ టౌన్, జనవరి 9 : క్రీడలతో మానసికోల్లాసం పెంపొందుతుందని ట్రాన్స్కో ఎస్ఈ శ్రీరామ్మూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలో ని స్టేడియంలో మంగళవారం విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రస్థ్ధాయి వాలీబాల్ టోర్నీ నిర్వహించారు. ఎస్ ఈ ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వి ధుల్లో నిత్యం బిజీగా ఉండే ఉద్యోగులకు క్రీడలు ఉల్లాసాన్ని, ప్రశాంతతను ఇస్తాయని తెలిపారు. టోర్నీలో ఆయా జట్లు ప్రతిభ చాటాలని సూచించారు. డీవైఎస్వో శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నా రు. కార్యక్రమంలో డీఈలు చంద్రమౌళి, వెంకటశివరామ్, స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, గేమ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షకీల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మహబూబ్నగర్ ఆపరేషన్ జట్టు 15-03, 15-08 సెట్ల తేడాతో కరీంనగర్ ఓఎంసీ జట్టుపై గెలిచి శుభారంభం చేసింది. మిగతా మ్యాచ్ల్లో ఖ మ్మం జట్టు 15-08, 15-10 సెట్ల తేడా నిజామాబాద్పై, హైదరాబాద్ సౌత్జట్టు 15-10, 10-15, 15-13 సెట్ల తేడాతో మహబూబ్నగర్ ఆపరేషన్పై గెలిచాయి. టోర్నీలో మహబూబ్నగర్ ఆ పరేషన్, మహబూబ్నగర్ ఓఎంసీ, ఖమ్మం ఆపరేషన్, ఖమ్మం ఓఎంసీ, కరీంనగర్ ఆపరేషన్, క రీంనగర్ ఓఎంసీ, నల్లగొండ ఆపరేషన్, నల్లగొండ ఓఎంసీ, ఆదిలాబాద్ ఆపరేషన్, ఆదిలాబాద్ ఓ ఎంసీ, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ సెంట్రల్, హబ్సిగూడ ఆపరేషన్ జట్లు తలబడుతున్నాయి. 160 మందికిపైగా క్రీడాకారులు పాల్గొన్నారు.