భూత్పూర్/కల్వకుర్తి/కోస్గి/వెల్దండ/మూసాపేట/నవాబ్పేట/ తిమ్మాజిపేట, మే 26 : భూత్పూర్ మండలంలో ఆదివా రం సాయంత్రం ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూత్పూర్లోని శ్రీమునిరంగస్వామి ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం నేలకొరిగింది. కల్వకుర్తి పట్టణంలోని పలు కాలనీల్లో చెట్లు ఈదురుగాలులకు విరి గి రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. కోస్గిలో జరిగే వారాంతపు సంత అతలాకుతలమవడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రామాలయం చౌరస్తా వద్ద ఉన్న హైమాస్ట్ లైట్ స్తంభం విరిగి కరెంట్ తీగలపై పడిపోగా.. పోల్లేపల్లి, ముశ్రీఫా గ్రామాల్లో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. వెల్దండ మండలం చౌదర్పల్లిలో రైతు ఒట్టు బాలకిష్టయ్య పొలంలోని తుమ్మచెట్టుపై పిడుగుపడింది. ఆ సమయంలో చెట్టుకింద ఉ న్న ఆవు మృతి చెందగా, బాలకిష్టయ్య అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్కు తరలించారు. కొట్ర పరిధిలోని క ల్వకుర్తి-హైదరాబాద్ రహదారిపై భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడడంతో అరగంట పాటు రాకపోకలు స్తంభించిపోయాయి.
పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ను నియంత్రించా రు. పలు గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మూసాపేట మండలం సంకలమద్ది గ్రామంలో రేషన్ డీలర్ మేకల వాసుదేవమ్మ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మూసాపేట, అడ్డాకుల మండలాల్లో విద్యుత్ తీగలు తెగిపడగా సిబ్బంది మ రమ్మతులు చేపట్టి కరెంట్ను పునరుద్ధరించారు. నవాబ్పేట మండలం ఇప్పటూర్లో సత్యం నిర్వహిస్తున్న రేకుల హోటల్ ఎగిరిపోయింది. గ్రామంలో కరెంట్ స్తంభాలు విరిగి ఇండ్లు, వాహనాలపై పడి తీవ్ర నష్టం వాటిల్లింది. పలు గ్రామాల్లో మా మిడికాయలు రాలిపోగా.. మరికొన్ని చోట్ల ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. తిమ్మాజిపేట మండలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మారేపల్లి, మారేపల్లి కాలనీల్లో మూడు ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపోగా.. కరుణాకర్రెడ్డి కోళ్లషెడ్డు కుప్పకూలిపోయింది. ఈదురుగాలులకు ట్రాక్టర్ ట్రాలీ తిరగబడిపోగా.. మారేపల్లి, బాజీపూర్లో విద్యుత్తు స్తంభాలు, చెట్లు విరిగాయి. దీంతో రాత్రి వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.