పెద్దమందడి, జనవరి 4 : రాష్ట్రంతోపాటు నియోజకవర్గంలో కూడా ఇంచు భూమీ బీడు ఉండకూడదని, ఏ ఒక్క మనిషీ ఖాళీగా ఉండొద్దన్నదే తెలంగాణ ప్ర భుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతులకు మంజూరైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నంపెట్టే వా రే దేవుడులాంటి వారని అలాంటి రైతులకు రాష్ట్ర ప్ర భుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. రైతులకోసం సర్కారు ఏడాదికి ప్రాజెక్టులు, విద్యుత్, రైతుభీమా, రైతుబంధు తదితర వాటిపై రూ.60వేల కోట్లకు పైబడి ఖర్చు చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమేనన్నారు. రైతుబంధుకు ఒక్క సీజన్కు రూ.7500 కోట్లు రైతు ఖాతాలలో జమచేస్తూ ఇప్పటివరకు 8 సీజన్లలో రూ.50వేల కోట్లకు పైబడి సాయం అందించామన్నారు. ఇలాంటి పథకాలు దేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేవన్నారు. పెద్దమందడి మండలంలోని 499 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్లు పెండింగ్లో ఉండగా ఏకకాలంలో ట్రాన్స్ఫార్మర్లను అందించామన్నారు. వనపర్తికి 600 పడకల దవాఖాన మంజూరైనట్లు వెల్లడించారు. ఇంజినీరింగ్ కళాశాలను కూడా తీసుకొస్తామన్నారు. గత 60 ఏండ్ల పరిపాలన చేసిన సన్యాసులు ఏ పనులు చేయడానికి చేతకాక నేడు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న గుండు, అరగుండు, ఇంతోడు, అంతోడు లేచిలేచి పడుతున్నారని చురకలంటించారు. రాష్ట్ర ప్రజలంతా వాళ్లు చేస్తున్న డ్రామాలన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన జవాబు ఇవ్వడం తెలుసన్నారు. అనంతరం రైతుబంధు వారోత్సవాలలో మంత్రి పాల్గొన్నారు. కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు వేసిన ముగ్గులను పరిశీలించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, ఎంపీపీ మేఘారెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజప్రకాశ్రెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీటీసీ చెన్నమ్మ పాల్గొన్నారు.
మహిళల స్వయం అభివృద్ధికి కృషి..
మహిళలు స్వయం అ భివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు స్వచ్ఛం ద సంస్థలు కృషి చేస్తున్నాయని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని కడుకుంట్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. స్వచ్ఛంద సంస్థలు అందించిన కుట్టుమిషన్ల మంత్రి పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఇక్రిశాట్, బైఫ్ల స్వచ్ఛంద సంస్థ గ్రామీణ మహిళల అ భివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అంతకుముందు గ్రామంలో ప్రజలతో ముచ్చటించారు.
మెడికల్ కళాశాల పనులను వేగవంతం చేయాలి..
నిర్మాణంలో ఉన్న మెడికల్, నర్సింగ్ కళాశాల భవన పనులు నాణ్యతగా వేగవంతంగా చేపట్టాలని మంత్రి కాంట్రాక్టర్లను ఆదేశించారు. వనపర్తిలో మెడికల్, నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. సంక్రాంతి పండుగలోగా పనులను పూర్తి చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ పర్యటన తేదీ ఖారారయ్యేలోపు పనులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విన్సింగ్వాన్, డీపీవో సురేశ్కుమార్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, కమిషనర్ మహేశ్వర్రెడ్డి, సర్పంచ్ హరిత, వైస్ ఎంపీపీ సువర్ణ, సర్పంచ్ రామకృష్ణ, గొర్రెల కాపరుల సంఘం చైర్మన్ కురుమూర్తియాదవ్ పాల్గొన్నారు.
కరెంటు కష్టాలుండవు..
రాబోవు రోజుల్లో నీటి, క రెంట్ కష్టాలుండవని, సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరా సాగులోకి రావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఉమ్మడి మండల రైతులకు వి ద్యుత్ సర్వీస్ కనెక్షన్ల కింద మంజూరైన 25కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ను మంగళవారం స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మండలానికి 150ట్రాన్స్ఫార్మర్స్ మంజూరు కాగా, 76 ట్రాన్స్ఫార్మర్స్ లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగతా వారికి కూడా తొందరలోనే ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ నాగేంద్ర కుమార్, డీఈ నరేంద్రకుమార్, ఏడీ యాదయ్య, ఏఈ నర్సింహులు, జెడ్పీటీసీలు భార్గవి, భీమయ్య, ఎంపీపీ సంధ్య ఉన్నారు.