నవాబ్పేట, ఫిబ్రవరి 24 : మండలంలోని ఫత్తేపూర్ మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మైసమ్మ ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ఫత్తేపూర్ మైసమ్మ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మ య్య, ముడా డైరెక్టర్ చెన్నయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, నాగిరెడ్డి, ప్రతాప్, ఈవో మదనేశ్వర్రెడ్డి, మాజీ చైర్మన్ పాశం గోపాల్ పాల్గొన్నారు.
కరాటే టోర్నీ బ్రోచర్ ఆవిష్కరణ
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 24 : కరాటే ఫెడరేషన్ ఆఫ్ షోటోకాన్ ఆధ్వర్యంలో జడ్చర్లలో మార్చి 12న నిర్వహించనున్న సౌత్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్షిప్ పోటీలకు సంబంధించిన బ్రోచర్ను హైదరాబాద్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రస్థాయి కరాటే పోటీలు జడ్చర్లలో నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కరాటే అసోసియేషన్ తెలంగాణ ప్రధానకార్యదర్శి తాజుద్దీన్, మాస్టర్లు కిట్టు, ఖాజామొహియొద్దీన్, ఉస్మాన్, అబ్దుల్లా, వరుణ్ పాల్గొన్నారు.