జడ్చర్లటౌన్, డిసెంబర్ 1 : జడ్చర్ల నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఓటింగ్ సరళిపై రాజకీయ పార్టీల నాయకులు పోలింగ్ భూత్ల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. పోలింగ్ బూత్ల వారీగా నమోదైన ఓట్ల కు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఏఏ కేంద్రలలో ఎంత మంది ఓటర్లకు ఎన్ని ఓట్లు పోలయ్యాయి.. అనే వివరాలను తెలుసుకుంటున్నారు. పోలైన ఓట్లలో తమకు అనుకూలంగా ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రె స్ పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ కనిపించడంతో ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీకి ప్రజలు అవకాశం కల్పిస్తారన్న విషయంపై చర్చ జరుగుతున్నది. ఈనెల 3వ తేదీన జరుగనున్న కౌంటింగ్ నేపథ్యంలో రిజల్ట్స్ కోసం జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గంలోని జడ్చర్ల, మిడ్జిల్, ఉ ర్కొండ, బాలానగర్, రాజాపూర్, నవాబ్పేట మం డలాల్లో మొత్తం 274 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మొత్తం 2,20,244 మంది ఓటర్లు ఉన్నారు.
వీరిలో 1,10,783 మంది పురుషులు, 1,09,456 మంది మహిళలు, ఐదుగురు ఇతర ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 81.11 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ప్రధానంగా మహిళల ఓటిం గ్ శాతం అధికంగా నమోదైన క్రమంలో ఎవరికీ వారు తమకు అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే కొత్త ఓటర్ల ఓటింగ్ ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై చర్చ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఎవరూ గెలిచిన స్వల్ప మెజార్టీతోనే గెలుస్తారని రాజకీయ పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. ఇది ఇలా ఉండగా జడ్చర్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 9 ఏండ్లలో కాలంలో నియోజకవర్గంలో అన్ని వి ధా లా అభివృద్ధి చేసిన క్రమం లో బీఆర్ఎస్ పార్టీకే ప్రజ లు మరోసారి అవకాశం ఇస్తారని బీఆర్ఎస్ నాయకు లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హ్యాట్రిక్ విజ యం సాధిస్తారని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ నాయకుడి గెలు పు ఖాయమని కాంగ్రెస్ నాయకులు అంటున్నా రు. ఇది ఇలా ఉండగా ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్న మిగతా అభ్యర్థులు మాత్రం తమకు ఏ మేరకు ఓట్లు వచ్చే అవకాశాలున్నాయో విశ్లేషించుకుంటున్నారు.