అక్టోబర్ 25: సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఎంపీటీసీ తిరుపతయ్య, సర్పంచ్ శ్యాంసుందర్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామల్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.జీన్గురాల గ్రామంలో ఎంపీటీసీ తిరుపత య్య, సర్పంచ్ శ్యాంసుందర్రెడ్డి గడపగడపకు వెళ్లి బీఆర్ఎస్ మ్యానిఫెస్టో, సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే ఆల చేసిన అభివృద్ధిని ప్రజలకు వివారించారు. వచ్చే ఎన్నికలో ఆల వెంకటేశ్వర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కె ట్ కమిటీ డైరక్టర్ భాస్కర్గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నర్సింహరెడ్డి, నాయకులు రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), అక్టోబర్ 25: బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టో పేదలకు వరమని ఆపార్టీ నాయ కులు అన్నారు. కౌకుంట్ల, చిన్న చింతకుంట మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ నాయకులు పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ, కారు గుర్తుకు ఓటు వేసి ఆల వెంకటేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్య క్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కొత్తకోట, అక్టోబర్ 25: మండలంలోని పాలెం, నిర్వేన్ గ్రామాల్లో బుధవారం జెడ్పీవైస్ చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీ గుంతమౌనిక జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎన్ని కల మ్యానిపెస్టోను మహిళలకు, రైతులకు వివరించారు. రాష్ట్రంలో 93 లక్షల మంది రేషన్కార్డు దారులకు బీమా సౌకర్యం, సౌభాగ్య లక్ష్మి కింద రూ.3వేలు, రూ. 400లకే సిలిండర్, రైతులకు రైతుబంధు పెంపు వంటి పథకాలను వివరించారు. కారు గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిని లక్షా మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి ప్రశాంత్, సర్పం చుల సంఘం మండల అధ్యక్షుడు ఆకుల శ్రీను, అల్లభాష, రామకృష్ణ, మైబు, అలీం తదితరులు పాల్గొన్నారు.
మదనాపురం, అక్టోబర్ 25 : దేవరకద్ర నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని పార్టీ నియోజక వర్గ మహిళా అధ్యక్షురాలు జయంతి అన్నా రు. బుధవారం మండలంలోని గోవిందహళ్లి, దంతనూరు, శంకరమ్మపేట గ్రామాల్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి మద్దతుగా మండల నాయకులు విసృత ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేసిన అభివృద్ధ్ది , సం క్షేమ పథకాలను వివరిస్తు, కారుగుర్తుకు ఓటువేసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి హ్యాట్రిక్ విజయం అం దించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జయంతి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధ్దికి ఆమడ దూరంలో నిలిచిన దేవరకద్ర నియోజక వర్గాన్ని, 2014 తరువాత ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడని, చేసిన అభివృద్ధ్ది మన కళ్ల ముందే కనిపిస్తుందన్నారు. ప్రతి గ్రామానికి కోట్ల రూపాయల నిధు లు తెచ్చి నియోజక వర్గాన్ని అభివృద్ధ్ది పథంలో నడిపి సున్న ఆయనను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు, జెడ్పీటీసీ కృష్ణయ్య, మార్కెట్ మాజీ చైర్మన్ వెంకట్నారాయణ, రైతుబంధు జిల్లా సభ్యుడు రవీందర్రెడ్డి, మండల కో ఆర్డినేటర్ హనుమాన్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాదగిరి, ప్రధాన కార్యదర్శి మాసన్న, మాజీ అధ్యక్షుడు రాములు, సింగిల్విండో వైస్ చైర్మన్ శ్రీనివాసులు, మండల ప్రచార కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, మాజీ ఎంపీటీసీ నాగన్న యాదవ్, కోఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, మహేశ్, మురళి, రమేశ్, విష్ణు, కృష్ణ,ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మూసాపేట, అక్టోబర్ 25 : నియోజకవర్గ అభివృద్ధి కో సం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ని మరో సారి భారీ మెజార్టీతో గెలింపించుకుందామని జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ అన్నారు. మూసాపేట మం డలంలోని పోల్కంపల్లి గ్రామంలో బుధవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చేసిన అభివృద్ధి గురించి వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు చంద్రశేఖర్, శ్రీనివాసులు, ఉపసర్పంచ్ మధు, గూపని కొండయ్య, జమీర్, నర్సింహులుగౌడ్, అనిల్కుమార్రెడ్డి, రామకృష్ణ, అంజనేయులు తదతరులు పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), అక్టోబర్ 25 : అడ్డాకుల మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అడ్డాకుల మండల కేంద్రంతో పాటు, పెద్ద మునగల్చేడ్, పోన్నకల్, కందూరు. రాచాల, కాటవరం, గుడిబండ, చిన్నమునగల్చేడ్ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టోను వి వరిస్తూ, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కలిగే లాభాలను వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నల్లమద్ది రాజ శేఖర్రెడ్డి, ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.