నారాయణపేట, నవంబర్ 2: సీఎం కేసీఆర్ సారథ్యం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి గడపకు చేరాయని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 17వ వార్డులో ఆమె స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరిస్తూ రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అందాలంటే కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, వైస్చైర్మన్ హరినారాయణ భట్టడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి, కౌన్సిలర్లు శిరీష, నారాయణ మ్మ, అనిత, మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మీ, బీఆర్ఎస్ నాయకుడు బుల్లెట్రాజు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్, నవంబర్ 2: సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేశారని బీఆర్ఎస్ నాయకులు అన్నా రు. గురువారం పట్టణంలోని 2, 3, 6, 7, 8, 10, 12, 13, 15, 18 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించి బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్రెడ్డికి ఓటేసి హ్యాట్రిక్ విజయం అందించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గురులింగం, అమీరుద్దీన్, శివరాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, హన్మంత్రెడ్డి, రఘు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్, నవంబర్ 2: పేట మండల లోని అభంగాపూర్, అప్పిరెడ్డిపల్లి, జాజాపూర్, సింగారం, బండగొండ, భైరంకొండ, చిన్నజట్రం తదితర గ్రామాల్లో గురువారం బీఆర్ఎస్ నాయకులు ముమ్మర ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సారథ్యంలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి కారుగుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో బీఆర్ఎస్కు మరోసారి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రవి, బాలప్ప, షేక్ ఉస్సేన్, మాసప్ప, వెంకటయ్య, వెంకటప్ప, కనకప్ప, విశ్వనాథ్, హన్మంతు, కిష్టప్ప, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
మరికల్, నవంబర్ 2: కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మె ల్యే ఎస్.రాజేందర్రెడ్డిని భారీ మోజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. గురువారం మండల కేంద్రంలో వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మరికల్ మండలంలో బీఆర్ఆస్ ఆ ధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని ప్ర జలకు వివరించారు. కార్యాక్రమంలో ఎంపీటీసీ గోపాల్, రామస్వామి, బసంత్, కొండారెడ్డి, కృష్ణయ్య, రామన్గౌడ్, మండల యుత్ అధ్యక్షుడు రాజేశ్, నారాయణ, శివకుమార్, జగదీశ్తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడ, నవంబర్ 2: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మ్యానిపేస్టోను గురువారం మండలంలోని మందిపల్లి గ్రామంలో పేట వ్యవసాయ మర్కెట్ కమిటీ సభ్యులు సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరిగి వివరించారు. ధన్వాడ మండల అభివృద్ధి కోసం మరోసారి ఎమ్మెల్యే ఎస్.ఆర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలోఎంపీటీసీ ప్రమీలమ్మ, నాయకులు వెంకటయ్య, ధన్వాడ సర్పంచ్ అమరేందర్రెడ్డి, నాగిరెడ్డి, కాళప్ప పాల్గొన్నారు.