మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 10 : ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్రెడ్డి గతంలో రెండున్నరేండ్లు బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేసి మహబూబ్నగర్లో కనీసం రెండు పనులు కూడా చేయలేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని 43వ వార్డు పరిధిలోని రాంనగర్, 27వ వార్డు వల్లబ్నగర్, గణేశ్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డు ప్రచారానికి వచ్చిన మంత్రికి స్థానికులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014లో ఓడిపోయిన తర్వాత మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజల మధ్యకు కాంగ్రెస్ అభ్యర్థి వచ్చాడని, ఇలాంటి వారిని ప్రజలు నమ్మి ఓటేస్తే తీరని కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. 55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పాలమూరును కరువుకు నిలయంగా మార్చిందని, ఇప్పుడిప్పుడే పచ్చబడుతుండగా, మళ్లీ అభివృద్ధికి అడ్డం పడేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. పదేండ్లలోనే 60ఏండ్ల అభివృద్ధి సాధించామని, చేసిన మంచిని గుర్తించి మరోసారి బీఆర్ఎస్ అండగా నిలవాలని ప్రజలను కోరారు.
అభివృద్ధి విఘాతకులైన కాంగ్రెస్, బీజేపీ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం 27వ వార్డులోని వల్లబ్నగర్, గణేశ్నగర్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్గౌడ్కు స్థానికులు రోడ్డుపై పూలు పరిచి, బోనాలతో మహిళలు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్థానిక ప్రజల అభీష్టం మేరకు రూ.50లక్షలతో శ్మ శానవాటిక నిర్మించామని, నల్లచెరువు వరద పరిష్కారం కోసం పెద్ద తూము నిర్మాణం చేట్టామన్నారు. అనం తరం వీరభద్రకాలనీ, 30, 31 వార్డు వీరన్నపేటలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, జేపీఎన్సీ చైర్మన్ కేఎస్ రవికుమార్, రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్, మార్కెట్ కమిటీ డైరక్టర్ నరేందర్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ రా ములు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, ము న్సిపల్ కో ఆప్షన్ మెంబర్ జ్యోతి, కౌన్సిలర్లు సంధ్య, రాము, మాజీ కౌన్సిలర్ పద్మజ, నాయకులు శ్రీని వాస్రెడ్డి, శరత్రెడ్డి, నరేందర్, సమద్ఖాన్, జహంగీ ర్పాషా ఖాద్రీ, రాజశేఖర్, శాంతయ్య, లక్ష్మణ్, కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ అర్బన్, నవంబర్ 10 : జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో పట్టణంలోని 9వ వార్డు పాల్కొండకు చెందిన యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మరి శేఖర్, మహేశ్గౌడ్, శ్రీధర్ యాదవ్, మహేశ్యాదవ్, రఘుచారి, వెంకటేశ్తో పాటు 50మంది, హన్వాడ మండలం దాచకపల్లి శివా రు గ్రామమైన దయ్యాలమర్రి తండాకు చెందిన కాంగ్రె స్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కుమ్మరి రాజు, యువజన విభాగం అధ్యక్షుడు గోపాల్, ఆనంద్, భూపతి, ఆనం ద్, దశరథ్, గౌతమ్తోపాటు 50మంది, అలాగే న్యూ టౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఎన్ఎస్యూఐ అసెం బ్లీ అధ్యక్షుడు శ్రీరామ్, నాయకులు శ్రీనాథ్, ఆశోక్, శ్రీనివాస్రెడ్డి, నర్సింహులుగౌడ్, మైబుతోపాటు 50 మంది మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహు లు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, కృష్ణమోహన్, శాంతన్నయాదవ్, కౌన్సిలర్లు రవికిషన్రెడ్డి, నరేందర్, ఆంజనేయులు, సురేందర్రెడ్డి, రమేశ్నాయక్ తదితరు లు పాల్గొన్నారు.