మహబూబ్నగర్, ఏప్రిల్ 10 : ఉమ్మడి జిల్లాలోనే పెద్దదైన మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు నిత్యం వేలల్లో రోగులు వస్తున్నారని, అయితే స్థానికంగా వసతులు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు పడ్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి హౌస్ సర్జన్ శాలిని తీసుకొచ్చారు. పదేండ్లుగా దవాఖాన, మెడికల్ కళాశాలకు వైద్యసేవలో గుర్తిం పు తీసుకొచ్చామని తెలిపారు.
దవాఖానను కొత్త భవనంలోకి మార్చితే మెరుగైన సేవలందిస్తామని తెలిపారు. హైదరాబాద్ వెళ్లకుండా స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే స్పందించిన మంత్రి మాట్లాడుతూ బస్టాండ్ సమీపంలో భవనం పనులు పూర్తి చేసి జూన్లోగా దవాఖాన తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
శుక్రవారం మహబూబ్నగర్ ప్రభు త్వ దవాఖానలో నిర్వహించిన స్వచ్ఛంద మెగా రక్తదాన శిబిరాన్ని విప్, ఎమ్మెల్యే యెన్నంతో కలసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మెడికల్, నర్సింగ్ కళాశాలల విద్యార్థులతో మా ట్లాడి సమస్యలు తెలుసుకొన్నారు. దక్షిణ తెలంగాణలోని నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాలకు మహబూబ్నగర్ సూపర్ స్పెషాల్టీ దవాఖాన రిఫరల్ సెంటర్గా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ కుష్బూ గుప్తా, అ దనపు కలెక్టర్లు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ఉన్నారు.