మహబూబ్నగర్టౌన్, జనవరి 4 : క్రీడల్లో ప్రతిభ చాటి క్రీడాకారులు రాణించాలని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 సెక్రటరీ రమేశ్బాబు అన్నారు. జిల్లా ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక స్టేడియంలో ఉమ్మడి జిల్లా అండర్-14 బాల,బాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. రమేశ్బాబు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదవలేదని, ఎంతోమంది రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించారని అ న్నారు. టోర్నీ క్రీడాకారులు ప్రతిభతో జట్టు విజయానికి కృషి చే యాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో కోచ్ సాధిక్అలీ వ్యాయామ ఉపాధ్యాయులు వేణుగోపాల్, నాగరాజు, రాఘవేందర్, మేరిపు ష్ప, వెంకట్, నాగమణి, ఫకృద్దీన్, కపిల్, ఉదయ్ పాల్గొన్నారు.