Nallamala Forest | దట్టమైన అడవిలో గడపాలని ప్రకృతి ప్రేమికులు కోరుకుంటారు.. అలాంటి వారు కొద్ది రోజులు ఆగా ల్సిందే.. అడవిలో ఆతిథ్యంపై అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఆంక్షలు విధించింది. వన్యప్రాణుల సంతానోత్పత్తికి సమయం కావడంతో మూడు నెలలపాటు అడవిలో సఫారీ టూర్కు బ్రేక్ విధించారు. అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూలై 1 నుంచి సెప్టెంబర్ 31 వరకు పెద్ద పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులు జతకూడే సమయమని, ఎలాంటి అలజడం ఉండకూడదనే ఉద్దేశంతో ఎన్టీ సీఏ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అటవీశాఖ అధికారి రోహిత్ గోపిడి వెల్లడించారు. అక్టోబర్ మొదటి వారంలో తిరిగి జంగల్ టూర్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదన్నారు.
అచ్చంపేట రూరల్, జూలై 10 : నల్లమల అటవీ ప్రాంతంలోకి ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు మూడు నెలలపాటు అనుమతి లే దని జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్ గోపిడి వెల్లడించారు. అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నల్లమలలో అనుమతులను నిలిపివేశారు. జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 31వ తేదీ వరకు (మూడు నెలలు) వన్యప్రాణులు ప్రధానంగా పెద్ద పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులు సంతానోత్పత్తికి జతకూడే సమయం కావడంతో 90 రోజుల పాటు సఫారీ టూరిజం ప్యాకేజీని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నామన్నారు. సంతానోత్పత్తి సమయంలో పులులకు అలజడి ఉండకూడదనే ఉద్దేశంతో రిజర్వు అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ (ఎన్టీసీఎ ) ఆదేశించిందన్నారు. నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో 2,61,139 చదరపు కిలోమీటర్ల పరిధిలో అమ్రాబాద్ రిజర్వు టైగర్ (ఏటీఆర్)విస్తరించి నల్లమల భారత దేశంలోనే రెండో అతి పెద్ద రిజ ర్వు టైగర్ ప్రాంతంగా పేరు గాంచింది. ప్రస్తుతం 23 పెద్దపులులు నల్లమలలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రత్యేక నిధులు కేటాయించి అడవులు, వన్యప్రాణుల సంరక్షణ చేపడుతున్నారు. నల్లమల అటవీ అందాలతోపాటు వన్యప్రాణులు, క్రూర మృగాల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశాలను దేశంతోపాటు విదేశీ ప్రకృతి, ప ర్యాటక ప్రేమికులు సై తం టూరిజం ప్యాకేజీతో నల్లమలలో పర్యటించేందుకు అటవీశాఖ అధికారులు రెండేండ్లుగా పర్యాటక యాత్రకు చర్యలు తీసుకున్నారు. పెద్దపులి సంభోగ సమయంలో ఏకాంతాన్ని కోరుకుంటుంది. అడవిలో చిన్న అలజడి కలిగినా అవి సంభోగంలో పాల్గొనవు. జూలై 1 నుంచి సెప్టెంబర్ 31వరకే పెద్దపులులలు సంతానోత్పత్తిలో పాల్గొంటాయి. ఈ సమయంలో పులులు చాలా ఆవేశంగా ఉంటాయని, ఇతర జంతువులు, మనుషులపై దాడి చేసే అవకాశం ఉన్నందున నల్లమలలో పర్యటనకు అనుమతులు నిలిపివేసినట్లు డీఎఫ్వో రోహిత్ తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు కూడా పశువులను కోర్ ఏరియాలో కాకుండా బఫర్ ఏరియాలో మేపుకునే అవకాశం కల్పించామన్నారు. ఈ విషయాలపై పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సఫారీ సేవలను అక్టోబర్ మొదటివారంలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.