ఊట్కూర్, సెప్టెంబర్ 21 : తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ పండుగను కులమతాలకతీతంగా వైభవంగా జరుపుకోవాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఊట్కూర్, అమీన్పూర్, పగిడిమర్రి, పులిమామిడి, పెద్దజట్రం గ్రామాల్లో ఐకేపీ ఏపీఎం నర్సింహులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నారని సూచించారు. ఎనిమిదేండ్లలో బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడ కూడా అమలుకాని సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను ప్రభుత్వం సమకూరుస్తోందని తెలిపారు. మండలవ్యాప్తంగా 13,588మంది మహిళలకు చీరలు మంజూరైనట్లు ఏపీఎం తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, వైస్ఎంపీపీ ఎల్లాగౌడ్, తాసిల్దార్ తిరుపతయ్య, ఎంపీడీవో కాళప్ప, సర్పంచులు సూర్యప్రకాశ్రెడ్డి, యశోద, సుమంగళ, సులోచనమ్మ, కతలప్ప, సూరయ్యగౌడ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి, బతుకమ్మ చీరలు పంపిణీ
జిల్లాకేంద్రం శివారులోని సింగారంచౌరస్తా వద్ద బుధవారం మండలంలోని ఆయా గ్రామాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను, ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్లను నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి పంపిణీ చేశారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 117మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 71మందికి ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్లను అందజేశారు. అలాగే ఆయా గ్రామాల మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీప అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, పీఏసీసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, తాసిల్దార్ దా నయ్య, డీటీ నారాయణ, సర్వేయర్ మల్లేశ్, ఎంపీవో రా జు, ఏపీఎం శకుంతల, సర్పంచులు సుగందమ్మ, జయం తి, శ్రీదేవి, సీతమ్మ, ఎంపీటీసీలు శేఖర్, రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేపూరి రాములు, కోట్ల జగన్మోహన్రెడ్డి, రవీందర్గౌడ్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.