మహబూబ్నగర్టౌన్/పాలమూరు, ఆగస్టు 27 : పేదల్లో ఆనందం నింపడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో శనివారం రూరల్ మండలానికి చెందిన 863మంది కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు రూ.89లక్షల 72వేల844 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కావొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని తెలిపారు. రూరల్ మండలంలో షాదీముబారక్ పథకంతో రూ.32లక్షలు, పింఛన్లు రూ.87కోట్ల 50లక్షలు, రైతుబంధుతో రూ.84కోట్ల 55లక్షలు, రైతుబీమాతో రూ.88లక్షలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు వివరించారు. పేదల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రభుత్వం నూతనంగా మంజూ రు చేసిన ఆసరా పింఛన్లను తానే స్వయంగా గ్రామగ్రామానికి వెళ్లి పంపిణీ చేస్తానని తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో 160మందికి రూ.79,55,800 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి శ్రీనివాస్గౌడ్ పంపిణీ చేశారు. అనారోగ్యం ఇతర కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలకు సీఎం సహాయనిధితో ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ముడా చైర్మెన్ గంజి వెంకన్న ముదిరాజ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, తాసిల్దార్ పాండూనాయక్, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ఎంపీపీ అనిత, రైతుబంధు సమితి డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గిరిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంకితభావంతో పని చేయాలి
ఉపాధి హామీ ఫీల్డ్అసిస్టెంట్లు అంకితభావంతో పనిచేసి కూలీలకు పనులు కల్పించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఫీల్డ్అసిస్టెంట్లను ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని కమలాగార్డెన్లో ఏర్పాటు చేసిన కృతజ్ఞతాసభకు మంత్రి హాజరు కాగా, ఉమ్మడి జిల్లాకు చెందిన ఫీల్డ్అసిస్టెంట్లు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, కౌన్సిలర్ షబ్బీర్, నాయకులు మల్లు నర్సింహారెడ్డి, వెంకటయ్య, ఫీల్డ్అసిస్టెంట్ల సంఘం నాయకులు అంజన్న, నారాయణగౌడ్, వెంకట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అవార్డుగ్రహీతకు సన్మానం
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగ్రహీత నవాబ్పేట మండలం యన్మన్గండ్ల ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు టీఎన్.శ్రీధరన్ను జెడ్పీ సమావేశ మందిరంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్, ఏఎంవో వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.