మహబూబ్నగర్, జనవరి 10 : పేదలకు ప్రభుత్వం అం డగా ఉంటుందని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మహబూబ్నగర్ అర్బన్, రూరల్, హన్వా డ మండలాలకు చెందిన 24మందికి రూ.10,45,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్యానికి గురై ప్రైవే ట్ దవాఖానల్లో చికిత్స పొందే పేదలను సీఎం సహాయనిధి తో ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందన్నారు. ఆరోగ్య సంరక్షణపై ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నుంచి వందశాతం సబ్సిడీ పై మంజూరైన రూ.లక్ష చెక్కును లబ్ధిదారుడికి అందజేశారు. అనంతరం తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా కమిటీ క్యాలెండర్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో వెంకటేశ్, వెంకట్రాములు, పర్వతాలు, బాలరాజు, కృష్ణ, రాములు, గోపి, మహేశ్, సురేశ్ పాల్గొన్నారు.
మంత్రికి సన్మానం
మహబూబ్నగర్టౌన్, జనవరి 10 : మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులాల అతిథి ఉపాధ్యాయుల సంఘం నా యకులు సోమవారం జిల్లాకేంద్రంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా అతిథి ఉపాధ్యాయుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు ప్రభాకర్, జిల్లా అధ్యక్షురాలు తేజస్విని, వెంకటేశ్వర్లు, గోవిందు, నవీన్, ఉ పేందర్గౌడ్, రవికుమార్, లింగస్వా మి, రాధిక, లక్ష్మి, రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు, జిల్లా అధ్యక్షుడు గురుప్రసాద్, కార్యదర్శి రాజుయాదవ్, మల్లేశ్, గంగాధర్ శివకుమార్, అనిల్కుమార్, కృష్ణమోహన్, రాఘవేందర్, పవన్కుమార్, జహీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.