వనపర్తి, డిసెంబర్ 5: మారుమూల గ్రామాల ప్రజలకు సైతం కేంద్ర ప్రభుత్వ పథకాలు అందే లా అధికారులు కృషిచేయాలని నాగర్కర్నూల్ ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ రాములు అధికారులను ఆదేశించారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పంచాయతీరాజ్, వ్యవసాయం, ఉపాధి హామీ పథకం, పీఎం యోజన, గ్రామీణ స్వచ్ఛ భారత్, ప్రధానమంత్రి సడక్ యోజన, జాతీయ ఆరోగ్య మిషన్తోపాటు ఇతర పథకాల అమలు తీరుపై సమీక్షించారు. ముందుగా ఆయా శాఖల అధికారులు సా ధించిన అభివృద్ధిని చదివి వినిపించారు.
ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ని ర్వహించే పథకాలు సక్రమంగా అమలు జరిగేలా దిశ కమిటీ పర్యవేక్షించాలన్నారు. పథకాల్లో ఏవై నా సమస్యలు ఉంటే వాటి పరిష్కార వేదికయే దిశ సమావేశమని జెడ్పీచైర్మన్ లోకనాథ్రెడ్డి తెలిపారు. పథకాల అమలు విధానంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనులను పూర్తిచేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా తెలిపారు. ప్రతి పథకంపై విస్తృత ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఆశిష్సంగ్వాన్, వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, జెడ్పీసీఈవో వెంకట్రెడ్డి, నర్సింహులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.