మహబూబ్నగర్, ఫిబ్రవరి 16 : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తలతోపాటు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, బీఆర్టీయూ, టీఎన్టీయూసీ, ఎస్కేఎం తదితర సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు, లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎం జిల్లా అధ్యక్షురాలు జయమ్మ, జిల్లా సహాయ కార్యదర్శులు గిరిజ, మల్లమ్మ, ఉపాధ్యక్షురాలు రాణి, రజిత, జిల్లా కోశాధికారి అన్నపూర్ణ, చంద్రకళ తదతరులు ఉన్నారు.
ఉద్యోగుల చిరకాల స్వప్నమైన పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జీలను ధరించి శుక్రవారం ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదాయ పన్ను పరిమితిని రూ.10లక్షలకు పెంచాలని డిమాం డ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యగులను వెంటనే క్రమబద్దీకరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రానాయక్,రాజేందర్రెడ్డి, శేఖర్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 16 : జడ్చర్లలో కార్మి క సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించా రు. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సత్తయ్య, రాష్ట్ర నాయకుడు కిల్లెగోపాల్ పాల్గొని మాట్లాడారు. కేంద్రం పేదలు, కార్మికుల కడుపుకొట్టి కార్పొరేట్, బడా వ్యాపారులకు వత్తాసు పలుకుతుందన్నారు.
దేవరకద్ర రూరల్ (చిన్న చింతకుంట), ఫిబ్రవరి 16: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తు న్న నాలుగు కార్మిక చట్టాలను రద్దుచేయాలని తెలంగాణ కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. భారత్బంద్లో భా గంగా శుక్రవారం చిన్న చింతకుంట మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మికులు, రైతులకు మేలు చేసే విధంగా చట్టాలను రూపొందిచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యా దగిరి, బాబు, నర్సింహ, భిక్షపతి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్, ఫిబ్రవరి 16 : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం మండల కేంద్రంలో ఆశా వర్కర్లు, అం గన్వాడీ టీచర్లు, సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రా మీణ భారత్బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాసీల్దార్ కార్యాల యం ఎదుట నిరసన తెలిపారు.
హన్వాడ, ఫిబ్రవరి 16 : రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని శుక్రవారం మండల కేంద్రంలోని తాండూరు-మహబూబ్నగర్ ప్రధాన రోడ్డుపై సీపీఎం నాయకులు, కార్మికులు రాస్తారోకో చేపట్టారు.
మిడ్జిల్, ఫిబ్రవరి 16 : మరోసారి మోదీ అధికారంలోకి వస్తే దేశాన్ని అమ్మకానికి పెడుతారని రాష్ట్ర రైతు సంఘం నాయకుడు రాము లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గ్రామీణ బంద్లో భాగంగా కార్మికులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు.
ఊట్కూర్, ఫిబ్రవరి 16 : కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సలీం, సీఐటీ యూ మండల అధ్యక్షుడు నారాయణ డిమాం డ్ చేశారు. దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం మండలకేంద్రంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, రైతు సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించి తాసీల్దార్ మమతకు వినతిపత్రం అందజేశారు. బిజ్వారంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.
మరికల్, ఫిబ్రవరి 16 : అంగన్వాడీ టీచ ర్లు, ఆశా కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
ధన్వాడ, ఫిబ్రవరి 16 : కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం మండల కేంద్రంలో సీపీఐ ఎంఎల్ ప్రజాపంథ ఆధ్వర్యంలో కార్మికులు, రైతులు రాస్తారోకో నిర్వహించారు.
మాగనూరు, ఫిబ్రవరి 16 : మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు గ్రామీణ బంద్ నిర్వహించారు. పురవీధుల గుండా ర్యా లీ నిర్వహించి అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
కృష్ణ, ఫిబ్రవరి 16 : మండలంలోని కాన్దొడ్డిలో శుక్రవారం పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.