మరికల్, డిసెంబర్ 20 : మరికల్లోని సరస్వతీ డిగ్రీ క ళాశాలలో మక్తల్కు చెందిన అయ్యప్ప డిగ్రీ కళాశాల విద్యార్థులు డిగ్రీ పరీక్షలు రాస్తున్నారు. మక్తల్, మాగనూర్ నుం చి పరీక్షలు రాసేందుకు మరికల్ రావడం ఇబ్బందిగా ఉం దని మరికల్లోని పరీక్షా కేంద్రాన్ని మార్చాలని బుధవారం డిగ్రీ విద్యార్థులు పరీక్షా కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. పరీక్షలు రాయాలని పీయూ అధికారులు వచ్చిమీ సమస్యకు పరిష్కారం చెబుతారని కళాశాల యాజమాన్యం, పోలీసులు నచ్చజెప్పినా విద్యార్థులు వినిపించుకోలేదు. మక్తల్ నుంచి అయ్యప్ప డిగ్రీ కళాశాల యాజమాన్యం వ చ్చి విద్యార్థులకు నచ్చజెప్పడంతో గంటన్న ఆలస్యంగా పరీక్షలు నిర్వహించారు. అనంతరం పరీక్షా కేంద్రాన్ని పీయూ ఏఎస్డీ మధుసూదన్రెడ్డి, పరీక్షల విభాగం అధికారులు రాజ్కుమార్, కుమారస్వామి పరీశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మక్తల్ నుంచి అనువుగా ఉం టుందనే ఉద్దేశంతో మరికల్లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పటికిప్పుడు పరీక్షా కేంద్రాలను మార్చడం కుదరదని చెప్పారు. మక్తల్లో డిగ్రీ కళాశాల నిర్వహిస్తే అక్కడికి పరీక్షా కేంద్రం మారుస్తామని ప్రకటించారు.
మరికల్, డిసెంబర్ 20 : మరికల్లోని సరస్వతీ డిగ్రీ క ళాశాలలో నిర్వహించిన డిగ్రీ పరీక్షల్లో మాగనూర్కు చెంది న విద్యార్థి ఆంజనేయులు మంగళవారం మాస్కాపీయింగ్కు పాల్పడినట్లు గుర్తించిన స్కాడ్ ఆ విద్యార్థిని డీబార్ చేశారు. అవమానంగా భావించిన ఆంజనేయులు మాగ నూరు పరిసర ప్రాంతాల్లో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పీయూ అధికారులకు వినతి అందజేశారు.
పాలమూరు, డిసెంబర్ 20 : పీయూ పరిధిలోని మరికల్ సరస్వతీ డిగ్రీ కళాశాలలో జరిగిన పరీక్షలో ఆంజనేయు లు ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరం అని పీయూ ఉపకులపతి ఎల్బీ లక్ష్మీకాంత్రాథోడ్ విచారం వ్యక్తం చేశారు. పరీక్ష సమయంలో నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్ను విధుల నుంచి సస్పెండ్ చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు చీఫ్ సూపరింటెండెంట్, సిట్టింగ్ స్కాడ్లకు మెమోలు జారీ చేశామన్నారు. విద్యార్థి కుటుంబాన్ని కళాశాల యాజమాన్యం ఆదుకోవాలని సూచించారు.