మక్తల్ అర్బన్, అక్టోబర్ 21: పట్టణంలో దేవీశరన్నవ రాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం 8వ రోజు పట్టణంలోని కన్యకాపరమేశ్వరీ ఆలయంలో వాసవీ మాతా శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిక కుంకుమార్చ న, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాల్లో సుబ్రమణ్యం గారి అన్నమాచార్య కీర్తనలు, ఆర్యవైశ్య మహిళలు దాండి యా భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గుప్తా, కట్టా సురేశ్, మీరాబాయి, రేఖ, పద్మ, విజయలక్ష్మి, సుజాత, శిరీషా,కీర్తి, నిర్మ ల, కావ్య, శ్వేత, పార్వతి, స్వాతి, శ్రీలత, అనూషా, రజిని, దీక్షిత, వాసవీ క్లబ్, వనితా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
ఊట్కూర్, అక్టోబర్ 21: మండలంలో దేవీ శరన్నవ రాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక భవానీ మందిరం, ఈశ్వర్మందిర్, బిజ్వారం త్రిశక్తి పీఠం వద్ద నెలకొల్పిన దుర్గాదేవి విగ్రహాలకు శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిజ్వారం త్రిశక్తి పీఠం లో అమ్మవారు గజరాజుపై భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో త్రిశక్తి పీఠం గురువు ఆదిత్యపరాశ్రీ, భవా నీ మందిర్ ఆలయ కమిటీ అధ్యక్షుడు చౌద్రి అశోక్, తదితరులు పాల్గొన్నారు.
అమరచింత, అక్టోబర్ 21: మండలంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శనివారం చంద్రఘడ్, నందిమల్ల చౌరస్తా, మండల కేంద్రంలోని బీసీకాలనీ, జగన్వాడలో నెలకొల్పిన మండపాల వద్ద దుర్గామాతకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణానగర్లోని కాళికా మాత ఆలయంలో మహిళలు అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అనంతరం అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులుపాల్గొన్నారు.
ఆత్మకూరు, అక్టోబర్ 21: మండలంలో దేవీశరన్నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శనివారం అమ్మవారు లలిత త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మల్లాపురం ఆంజనేయస్వామి ఆలంయంలో నెలకొల్పిన దుర్గాదేవి మండపం వద్ద ధర్మకర్తల ఆధ్వర్యంలో హోమం, కుంకుమార్చన పూజలు చేశారు. వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వ హించి సాయంత్రం బతుక మ్మ సంబురాలు జరుపుకొన్నారు. నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బతుక మ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నాపెద్ద తేడా లేకుండా మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడిపాడారు. స్పటిక లింగేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం మహిళలు బతుకమ్మ వేడుకలు జరుపుకొన్నారు. కార్యక్రమాల్లో ఉత్సవకమిటీ సభ్యులు, భక్తు లు పాల్గొన్నారు.