పాలమూరు, నవంబర్ 22: ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచనల మేరకు మంగళవారం మండలంలోని వెంకటాపూర్, ఓబులాయపల్లి, బొక్కలోనిపల్లి, రాంచంద్రాపురంలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఇన్చార్జీలను నియమించారు. ఆయా గ్రామాల్లో 100మందికి ఇద్దరు చొప్పున ఇన్చార్జీలను నియమించారు. కార్యక్రమాల్లో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు దేవేందర్రెడ్డి, పీఏసీసీఎస్ కోటకదిర చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్యాదవ్, మం డల కోఆప్షన్ సభ్యుడు మస్తాన్, సర్పంచు లు మంగమ్మ, చంద్రకళ, యుగంధర్రెడ్డి, రాణెమ్మ, నాయకులు పాల్గొన్నారు.