పాలమూరులో పచ్చదనం పర్చుకున్నది. రూ.35 కోట్ల వ్యయంతో మున్సిపల్ అధికారులు 20 పార్కులను అందుబాటులోకి తీసుకొచ్చారు. పచ్చని లాన్లు, కూర్చునేందుకు బెంచీలు,వాకింగ్ ట్రాక్లు, చిన్నారులు సేదతీరేందుకు ప్రత్యేక వసతులు కల్పించారు. వివిధ రకాల మొక్కలతో సుందరీకరణ చేపట్టారు. దీంతో పెద్దలకు ఆహ్లాదం.. చిన్నారులకు వినోదం అందుతున్నది. నాడు సెలవు రోజుల్లో హైదరాబాద్ బాట పట్టిన ఇక్కడి సందర్శకులు నేడు ఇక్కడే ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. చిన్నారులకు ఆట విడుపు లభిస్తున్నది. సెలవుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో పార్కులు కిటకిటలాడుతున్నాయి. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధి చేశారు. ఇక్కడి పార్కుల అందాలకు ముగ్ధులైన
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో సైతం అభినందించారు.
మహబూబ్నగర్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్కులంటే పట్నం గు ర్తుకొచ్చేది. వారంతపు, సెలవుదినా ల్లో చాలా మంది హైదరాబాద్ బాటపట్టేవారు. ఆయా కాలనీల్లో ఖాళీ జాగాలన్నీ డంపింగ్ యార్డుల్లాగా దర్శనమిచ్చేవి. ము న్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పార్కుల అభివృద్ధిపై దృష్టి సారించకపోవడంతో చాలా జాగాలు కబ్జాకు గురయ్యా యి. అయితే, తెలంగాణ వచ్చాక సీన్ మారిపోయింది. టీఆర్ఎస్ పగ్గాలు చేపట్టడంతో పాలమూరు రూపురేఖ లు మారిపోయాయి. పట్నాన్ని తలదన్నేలా పార్కుల ను అభివృద్ధి చేశారు. పిల్లలకు కావాల్సిన ఆటవస్తువులను ఏర్పాటు చేయడంతో సాయంత్రం కాగానే పా ర్కులకు బారులుదీరుతున్నారు. బెంచీలు, పచ్చని లా న్లు, చుట్టూ వాకింగ్ ట్రాక్లు, రకరకాల పూల మొక్కలతో తీర్చిదిద్దారు.
మహబూబ్నగర్-హైదరాబాద్ రహదారిలో రూర ల్ పోలీస్స్టేషన్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని తెలంగాణ రాక ముందు కొందరు నేతలు కబ్జా చేయడానికి విఫలయత్నం చేశారు. రూ.కోట్లు విలువైన స్థలాన్ని మున్సిపాలిటీ నుంచి కాజేయాలని ప్లాన్ వేశారు. అయితే, ప్రజలు వ్యతిరేకించడంతో వారి పాచికలు పా రలేదు. మంత్రి శ్రీనివాస్గౌడ్ కబ్జాదారులకు చెక్పెట్టి జిల్లా కేంద్రంలోనే ఎక్కడా లేని విధంగా మోడల్ పా ర్కుగా తీర్చిదిద్దారు. సుమారు ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు అభివృద్ధికి రూ.30 లక్షలు ఖ ర్చు చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పార్కు వ్యూను చూసి అభినందించారు. ట్వీట్ చేయడంతోపాటు ఏకంగా అసెంబ్లీలో పార్కుల అభివృద్ధికి ఇదే నిదర్శనమంటూ విపక్షాలకు ఫొటో చూయించా రు. ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పార్కు ల అభివృద్ధికి లక్షలాది నిధులను తీసుకురావడంతో పా లమూరు.. పార్కుల ఊరుగా మారింది.
రూ.కోట్ల వ్యయంతో..
దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును ఏ ర్పాటు చేయడమే కాకుండా పాలమూరు పట్టణంలో 20 పా ర్కులను అభివృద్ధి చేశారు. ఇందులో 17 పార్కుల కోసం రూ.34.80 లక్షలు మున్సిపాలిటీ ఖర్చు చేసింది. పచ్చదనం ఉట్టిపడేలా రకరకాల మొక్కలను పెంచారు. పిల్లలు ఆ డుకునేందుకు రకరకాల ఆటవస్తువులను పార్కుల్లో ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో చాలామంది వాకింగ్ చేస్తున్నారు. ఆహ్లాదకర వాతవరణం ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు మున్సిపాలిటీ సిబ్బంది పార్కులను మెయింటనెన్స్ చేస్తున్నారు.
మంత్రి చొరవతో పార్కుల అభివృద్ధి..
మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవ తో మున్సిపాలిటీ పరిధిలోని అ న్ని పార్కులను అభివృద్ధి చేశాం. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పార్కులను తీర్చిదిద్దాం. ప్రత్యేకంగా తీసుకొచ్చిన మొక్కలను పెంచుతున్నాం. పచ్చని లాన్లు, కుర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేశాం. పార్కులు నీట్గా ఉండేలా చూస్తున్నాం. నిత్యం వందల మంది పార్కులను సందర్శిస్తున్నారు.
– నర్సింహులు, మున్సిపల్ చైర్మన్, మహబూబ్నగర్