వనపర్తి, జూలై 22 : గడిచిన తొమ్మిదేండ్లల్లో జరిగి న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని వ్యవసాయ శా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేం ద్రంలోని మంత్రి నివాసగృహంలో వనపర్తి, గోపాల్పేట, రేవల్లి మండల ముఖ్య నాయకులతో శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించిందన్నారు. సీఎం కేసీఆర్ హ యాంలో దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే అగ్రగామిగా నిలిచామన్నారు. గడిచిన తొమ్మిదేండ్లల్లో వనపర్తి ని యోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చే శామన్నారు. జిల్లాగా ఏర్పాటు కావడంతో పలు విద్యా సంస్థలు వెలిశాయన్నారు. జిల్లా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే చెరువులన్నింటినీ పునరుద్ధరించి సాగునీటితో నింపామన్నారు. వలసలు వెళ్లిన ప్రజలు తిరిగొచ్చి పల్లెల్లో వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రతి కార్యకర్త, నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా శిక్షణా తరగతుల అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, మండల, గ్రామాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.