మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
నర్వ, ఫిబ్రవరి 9 : నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని పాతర్చే డ్లో రూ.22 లక్షలతో నిర్మించిన 90 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకును బుధవారం ప్రారంభించారు. అనంతరం నర్వ జెడ్పీ ఉన్నత పాఠశాల లో రూ.10 లక్షలతో నిర్మించిన సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనశాలను ప్రారంభించారు. ప్రయోగశాల ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష పద్ధతితో పాఠాలు బోధించడానికి సులభంగా ఉం టుందని అభిప్రాయపడ్డారు. అలాగే పాఠశాల అభివృద్ధికి కావాల్సిన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉపాధ్యాయలకు వివరించారు. అనంతరం పాత గ్రామ పంచాయతీ భవనం వద్ద మినీ వాటర్ ట్యాంకును ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో శాశ్వతంగా మంచినీటి సమస్య తీరనుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు తాను ఇచ్చిన హామీలను దాదాపుగా పూర్తి చేశానని, ప్రజా సంక్షేమాభివృద్ధికి అవసరమైన పనులను గు ర్తించి నెరవేర్చుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములుశెట్టి, సర్పంచ్ కరుణాకర్రెడ్డి, వైస్ఎంపీపీ వీణావతి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దాతల సాయం అభినందనీయం
మాగనూర్, ఫిబ్రవరి 9 : పాఠశాల అభివృద్ధికి దాతల సా యం అభినందనీయమని మక్త ల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండల జిల్లా ప రిషర్ ఉన్నత పాఠశాలలో స్వ చ్ఛ్ భారత్-స్వచ్ఛ్ విద్యాలయంలో భాగంగా విద్యార్థుల కోసం మౌలిక వసతుల కల్పనకు సహకరించిన దాతలకు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బుధవారం సన్మాన కార్యక్ర మం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే, డీఈవో లియాఖత్ అలీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. దాతలను ఎమ్మెల్యే సన్మానించి అభినందించారు. విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాలలో దాతల సాయంతో నిర్మించిన అదనపు భవనాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఈవో లక్ష్మీనారాయణ, స ర్పంచ్ రాజు, జెడ్పీటీసీ వెంకటయ్య, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, ప్రజా ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయుడు న ర్సింహులు, ఉపాధ్యాయులు, ఆయా పాఠాశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.