భూత్పూర్, నవంబర్ 10 : బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్, నర్సింగాపూర్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోప్లాపూర్తో ఉద్యమ సమయం నుంచి తనకు అనుబంధమున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం రూ.కోటితో సీసీ రోడ్లు మంజూరు చేశానని తెలిపారు. నర్సింగాపూర్కు బీటీ రోడ్డు వేశాకే ఓట్లు అడుగుతానని చెప్పానని, ఇచ్చిన మాట ప్రకారం రూ.కోటితో బీటీ రోడ్డు వేశాకే ప్రచారానికి వచ్చినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహగౌడ్, వైస్ ఎంపీపీ నరేశ్గౌడ్, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, వసంత, ముడా డైరెక్టర్ చంద్రశేఖర్గౌడ్, మాజీ సర్పంచులు నారాయణగౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.