భూత్పూర్, జనవరి 6 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు, పట్టణాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నాయని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ అన్నారు. మండలంలోని కప్పెటలో శుక్రవారం వైస్ఎంపీపీ నరేశ్గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కప్పెట గ్రామాభివృద్ధిపై ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెద్దఎత్తున నిధులను మంజూరు చేయించారని వివరించారు.
కప్పెటకు బీటీరోడ్డు నిర్మించి గ్రామస్తుల కలను సాకారం చేసినట్లు తెలిపారు. అలాగే కాలనీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు తదితర నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దని కోరారు. బీఆర్ఎస్లో తెలుగు కుర్మన్న, తిరుపతయ్య, కృష్ణయ్య, వెంకటయ్య, వడ్డె యాదగిరి తదితరులు చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వేణుగోపాల్, బీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, యాదగిరి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.