దేవరకద్ర, ఏప్రిల్ 3 : దేవరకద్ర వ్యవసాయ మార్కెట్కు యార్డుకు ఉల్లి పోటెత్తింది. దాదాపు 12 వేల బస్తాలకు పైగా ఉల్లిని వివిధ గ్రామాల రైతులు విక్రయానికి తీసుకొచ్చారు. మార్కెట్లోని వ్యాపారస్తులతోపాటు బయటి నుంచి వచ్చిన వ్యాపారు లు కూడా వేలంలో పాల్గొనగా గత వారం కంటే ఈ వారం స్వల్పంగా ఉల్లి ధర పెరిగింది. క్వింటాకు గరిష్ఠంగా రూ.1500, కనిష్ఠంగా రూ.1000 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మార్కెట్ ధరలు లభించని రైతులు టెండర్లకు వెళ్లకుండా నేరుగా విక్రయదారులకే ఉల్లిని విక్రయించారు.