దేవరకద్ర రూరల్: పాలమూరు జిల్లాలోని దేవరకద్ర మండలంలో గల మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు అయిన కోయిల్ సాగర్లో ఆదివారం సాయం కాలం వరకు అందిన సమాచారం మేరకు 32.1 అడుగుల నీటినిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ 32.6 అడుగులు(2.27 టీఎంసీలు).
కాగా ప్రస్తుతం 32.1 అడుగుల వద్ద ఉంది. కోయిల్సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా పంట పొలాలకు సాగు నీటి విడుదల కొనసాగుతుంది. అదేవిధంగా నారాయణపేట, కొడంగల్, మద్దూర్ మండలాల త్రాగునీటి అవసరాల కోసం 10 క్యూసెక్కుల నీరు తరలింపు కొనసాగుతుంది.