భూత్పూర్, జనవరి 25 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని మూడోవార్డులో బుధవారం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటివెలుగు మొదటి విడుతలో రాష్ట్రవ్యాప్తంగా కోటీ 55లక్షలమందికి పరీక్షించి 55లక్షల మందికి కండ్లద్దాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. కాగా మూడోవార్డులో 249మందికి పరీక్షలు నిర్వహించి 24మందికి కండ్లద్దాలను అందజేసినట్లు సీహెచ్వో రామయ్య తెలిపారు. కప్పెటలో 256మందిని పరీక్షిం చి 23మందికి అద్దాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్రెడ్డి, డాక్టర్లు అబ్దుల్ రబ్బు, రాధిక, హిమబింధు, సూపర్వైజర్ యాదమ్మ, సుధాకర్ పాల్గొన్నారు.
గండీడ్, జనవరి 25 : ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంతో పేదలకు ఎంతో మేలు చేకూరుతున్నదని పరిగి ఎమ్మె ల్యే మహేశ్రెడ్డి అన్నారు. గండీడ్లో కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడా రు. అన్ని గ్రామాల్లో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన అద్దాలు, మందులను అందజేస్తారని, పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా జాతీ య బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని కప్లాపూర్ అంగన్వాడీ కేంద్రం చిన్నారులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కా ర్యక్రమంలో ఎంపీపీ మాధవి, సర్పంచ్ చం ద్రకళ, ఎంపీడీవో రూపేందర్రెడ్డి ఉన్నారు.
నవాబ్పేట, జనవరి 25 : కంటివెలుగు శిబిరాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో కృష్ణ సూచించారు. నవాబ్పేట, కొల్లూరు, రాంసింగ్తండాల్లో కంటివెలుగు శిబిరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కండ్లద్దాలు పంపిణీ, పరీక్షల వివరాలను తెలుసుకున్నారు. నవాబ్పేట లో 179మందికి పరీక్షలు నిర్వహించి, 47 మందికి కండ్లద్దాలు అందజేశారు. 17మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. రాం సింగ్తండాలో 143మందికి పరీక్షలు నిర్వహించి 17మందికి కండ్లద్దాలు అందజేశా రు. నలుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. కొల్లూరులో 202మందికి పరీక్షలు నిర్వహించి 27 మందికి కండ్లద్దాలు పంపిణీ చే శారు. 7మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టా రు. మొత్తం 524 మం దికి కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కంటివెలు గు ప్రోగ్రాం అధికారి రఫీక్, క్వాలిటీ కం ట్రో ల్ ఆఫీసర్ మోతీలాల్, హెచ్ఈవో సుభాష్ చంద్రబోస్, మండల వైద్యాధికారి విజయలక్ష్మి, బీచుపల్లిగౌడ్, శకుంతల, శరబలిం గం, రాఘవేందర్, అవినాష్ పాల్గొన్నారు.
జడ్చర్ల, జనవరి 25 : జడ్చర్ల మండలంతోపాటు మున్సిపాలిటీలో కంటివెలుగు కార్యక్రమం చురుకుగా సాగుతున్నది. ము న్సిపాలిటీలోని 1, 2 వార్డుల్లో ఏర్పాటు చేసి న శిబిరాల్లో 333మందికి పరీక్షలు నిర్వహించి 32మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. మరో 14మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ శివకాంత్ తెలిపారు. అలాగే మండలంలోని గంగాపూర్ , పెద్దఆదిరాల గ్రామాల్లో 350మందికి పరీక్షలు నిర్వహించి 14 మందికి కండ్లద్దాలను అందజేశారు. 12మందికి అద్దాల కోసం ఆర్డర్ పె ట్టినట్లు డాక్టర్ సమత తెలిపారు.
రాజాపూర్, జనవరి 25 : మండలకేంద్రంలోని పీహెచ్సీలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని తాసిల్దార్ రాంబాయి పరిశీలించారు. శిబిరంలో 139మందికి పరీక్షలు నిర్వహించి 35మందికి కండ్లద్దాలను పంపిణీ చేసినట్లు కంటివెలుగు కోఆర్డినేటర్ శ్రీనివాసులు తెలిపారు. మరో 15మందికి కండ్లద్దాలు అందజేసేందుకు ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్రావు, డాక్టర్ మౌనిక, డాక్టర్ ప్రస న్న, డాక్టర్ ఉత్తరయ్య పాల్గొన్నారు.
దేవరకద్ర, జనవరి 25 : మండలకేంద్రంతోపాటు బస్వాయిపల్లిలో కంటివెలుగు శిబిరాలను స్థానిక పీహెచ్సీ డాక్టర్ శరత్చంద్ర పర్యవేక్షించారు. మొత్తం 270మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారి కి కండ్లద్దాలు, మందులను అందజేసినట్లు తెలిపారు. కంటివెలుగు కార్యక్రమాన్ని మం డల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మిడ్జిల్, జనవరి 25 : మండలకేంద్రం, ఈదులబావితండాలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాలను ఎంపీడీవో సాయిలక్ష్మి ప్రారంభించారు. రెండు కేంద్రాల్లో 273మందికి కంటి పరీక్షలు నిర్వహించి 32మందికి అద్దాలు పంపిణీ చేశారు. 33మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు మనుప్రియ, కృష్ణకుమార్, ఎంపీవో అనురాధ, వైద్యసిబ్బంది జంగయ్య, దేవయ్య, పంచాయతీ కార్యదర్శి సాయన్న పాల్గొన్నారు.
బాలానగర్, జనవరి 25 : మండలకేంద్రంలో 184మందికి కంటి పరీక్షలు నిర్వహించి 15మందికి అద్దాలు పంపిణీ చేశా రు. 24మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ సృజన తెలిపారు. అలాగే చిన్నరేవల్లిలో 113మందికి పరీక్షలు నిర్వహించి 32మందికి కండ్లద్దాలు అందజేశారు. 19 మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు.
దేవరకద్ర రూరల్, జనవరి 25 : ప్రభు త్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. కౌకుంట్ల మం డలం పేరూర్లో 122మందికి పరీక్షలు నిర్వహించి 18మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. 12మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. చిన్నచింతకుంటలో 147మందికి పరీక్షలు చేసి 10మందికి అద్దాలు అందజేశారు. 30మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. మద్దూర్లో 161మందికి పరీక్షలు నిర్వహించి ఐదుగురికి అద్దాలు అందజేశారు. 8మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కంటివెలుగు అధికారులు డాక్టర్ సనా, సంతోష్, షఫిఖ్, వైద్యాధికారులు రాధిక, రాహుల్, క్యాంప్ కోఆర్డినేటర్ రాజన్న, ఖాదర్, సుశీల పాల్గొన్నారు.