అలంపూర్, ఆగస్టు 15 : జోగుళాంబ తల్లి చల్లని చూపు, ఆశీర్వాదం రాష్ట్రంలోని అందరిపై ఉండాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. మంగళవారం అలంపూర్ క్షేత్రంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని పద్మారావు గౌడ్ కుటుంబసభ్యులు 60మంది అమ్మవారు, స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు వారికి ఎమ్మెల్యే అబ్రహం, ఆర్డీ వో చంద్రకళ, ఆలయ ఈవో పురేందర్ కుమార్, అర్చకులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం శేషవస్ర్తాలతో సత్కరించారు. సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని, రామరాజ్యం మరోసారి రావాలని ఆయన ఆకాంక్షించారు.
ధరూరు, ఆగస్టు 15 : డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి జూరాల ప్రాజెక్టును సందర్శించారు. జెన్కో గెస్ట్హౌస్లో కాసేపు సేదతీరి తిరిగి గద్వాలకు వెళ్లారు. ఆయనకు ప్రాజెక్ట్ అధికారులు స్వాగతం పలికి సన్మానించారు.