నాగర్కర్నూల్టౌన్, మార్చి 15 : విద్యార్థు లు భయాందోళనకు గురి కాకుండా పరీక్షలకు హాజరుకావాలని డీఈవో గోవిందరాజులు సూ చించారు. శుక్రవారం గగ్గలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఆయన హాల్టికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 18నుంచి ఏప్రిల్ 2వ తేదీవరకు జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 20 మండలాల్లో మొత్తం 10,526 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అందుకుగానూ జిల్లా వ్యాప్తంగా 59 పరీక్ష కేం ద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్రా వు, నోడల్ అధికారి కుర్మయ్య, ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ నాగరాజు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదో తరగతి విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు లత పరీక్ష ప్యా డ్లు అందజేశారు. మొత్తం 50 మంది విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేశ్వరి, సురేశ్బాబు, తిరుపతయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.