వనపర్తి, మే 29 : తెలంగాణ ఉద్యమంతో పెనువేసుకున్న బంధాలతో కూడిన ఆనవాళ్లను చెరిపేసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. బుధవారం పట్టణంలోని మాజీ మంత్రి నివాసంలో తెలంగాణ దశాబ్ది వే డుకలపై కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భం గా మాజీ మంత్రి మాట్లాడుతూ ఆవిర్భావ ఉత్సవాలను బీఆర్ఎస్ శ్రే ణులు పల్లెలు, పట్టణాల్లో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. పద్నాలుగేండ్ల ఉద్యమకాలంలో కేసీఆర్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొ ని రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధి పథంలో నిలిపారన్నారు. కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి బానిస పాలన నుంచి విముక్తి కల్పించారన్నారు. తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగఫలితాలను జూన్ 2న ప్రజలకు వివరించాలని కోరారు. దశాబ్ది వేడుకలను మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పదేండ్ల తెలంగాణ అభివృద్ధి గుర్తులను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర గేయానికి ఆంధ్రా సంగీత దర్శకుడు కీరవాణితో సంగీతాన్ని సమకూర్చడం, కాకతీయ కళాతోరణాన్ని తొలగించి తెలంగాణ ప్రజలను అ గౌరవపర్చే పరిస్థితికి తీసుకొస్తున్నదన్నారు. పదేండ్ల ప్రశాంత వా తావరణాన్ని అల్లకల్లోలం చేసే దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తా రు. రాష్ట్ర సర్కారు చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇలాగే కొనసాగితే మరో తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేశ్గౌడ్, నాయకుడు కురుమూర్తియాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.