మహబూబ్నగర్,జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నష్టాలబాటలో ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకును ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజ న్రెడ్డి, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సహకారంతో లాభాల బాటలో నడిపిస్తున్నామని చైర్మన్ చిట్యాల నిజాంపాషా అన్నారు. ఈనెల 17న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లో ని పీఏసీసీఎస్ అధ్యక్షులతో కలిసి కరీంనగర్కు జిల్లా సహకార సంఘాల అవగాహన టూర్కు వెళ్లిన ఆయన గురువా రం నమస్తే తెలంగాణ ప్రతినిధితో మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుతో పాటు సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు గాను అవగాహన టూర్కు తరలివెళ్లామన్నారు. నాబార్డు నిధులతో ఏర్పాటు చేసిన ఈటూర్ ఈనెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు బ్యాచ్లుగా కొనసాగుతుందన్నారు. తొలివిడత తన అధ్యక్షతన 26 సంఘాల చైర్మన్లతో కలిసి కరీంనగర్ జిల్లా ముల్కనూరు, చొప్పదండి పీఏసీసీఎస్లను సందర్శించామన్నారు. ఆ సంఘాల పనితీరును న్యాప్స్కాబ్ అధ్యక్షుడు, కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావుతో కలిసి పరిశీలించామన్నారు. ఈ సందర్భంగా పీఏసీఎస్లు ఎలాం టి వ్యాపారాలు, విధానాలు అవలంభిస్తే అభివృద్ధ్ది చెందుతాయనే దానిపై చైర్మన్లకు అవగాహన కల్పించినట్లు ఆయన చెప్పారు. ముల్కనూరు, చొప్పదండి సంఘాలు డిపాజిట్ల సేకరణ, రుణాలు సకాలంలో వసూలు చేయడం, 2008లో కేంద్రం ఇచ్చిన రుణమాఫీ నిధులను సక్రమంగా వ్యాపారాభివృద్ధ్దికి వాడుకోవడంతో ఆరెండు సంఘాలు అదర్శంగా నిలిచాయన్నారు. రూ.57 కోట్ల నష్టంతో ఉన్న బ్యాం కును రూ.70 కోట్ల లాభాలతో నడిపిస్తున్నారని దీనికి సిబ్బంది కృషి, పాలకవర్గం పాలసీలే ప్రధాన కారణమన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఇలాంటి పాలసీలే ఉపయోగిస్తామని ఆయన వివరించారు.
రూ.1200 కోట్ల టర్నోవర్ చేస్తున్నాం
వందేళ్ల చరిత్ర కలిగిన మహబూబ్నగర్ డీసీసీబీ బ్యాంకు రూ. 1200 కోట్ల టర్నోవర్తో ఏటా రూ. 12 కోట్ల లాభా లను ఆర్జిస్తోందన్నారు. ఈఅవగాహన కార్యక్రమం వల్ల మరిన్ని పాలసీలు తయారు చేసి బ్యాంకు అభివృధ్దికి కృషి చేస్తామని నిజాంపాషా అన్నారు. నష్టాలబాటలో ఉన్న బ్యాం కును ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రుల సహకారంతో ఎక్కడా లేని విధంగా వివిధ వర్గాలతో డిపాజిట్లు సేకరించి బ్యాంకు, సహకార సంఘాలను బలోపేతం చేస్తు న్నామన్నారు. గతంలో ఇచ్చిన రుణాలు సక్రమంగా చెల్లించక పోవడంతో కొత్త రుణాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదన్నారు. సిబ్బంది కృషితో పాలకవర్గాలు కలిసి కట్టుగా పనిచేసి రుణాలు వసూలు చేసి ఊహించని స్థాయిలో లాభాలను ఆర్జించామన్నారు. వన్టైం సెటిల్మెంట్ కింద మొండి బకా యిలు వసూలు చేసే కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందన్నారు. బ్యాంకు ద్వారా రైతుల పిల్లలకు స్వదేశీ, విదేశీ రుణ స్కీం, గ్రామాల్లో రైతులకు గృహ రుణాలు, జేఎల్జీ వంటి వ్యవసాయేతర రుణాలు అందించడం ద్వారా బ్యాంకు పురోభివృద్ధ్దిలో సాగుతోందన్నారు. కరీంనగర్ జిల్లాలో ఆదర్శంగా ఉన్న సహకార సంఘాలను క్షేత్ర స్థాయి లో పరిశీలించడం ద్వారా పీఏసీసీఎస్ అధ్యక్షులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగిందన్నారు. వారి సహకారంతో, కలిసికట్టుగా మహబూబ్నగర్ డీసీసీబీతో పాటు సహకార సంఘాలను కూడా బలోపేతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టూర్కు వెళ్లిన వారిలో డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, డైరెక్టర్లు నర్సింహారెడ్డి, భీమ్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్లు పాలెం సుదర్శన్గౌడ్, రాజేశ్వర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు.