సామాజిక విప్లవానికి నాంది ఈ పథకం
అసమానతలు తొలగితే అన్ని కులాలు ఒక్కటే..
తెలంగాణ పథకాలతో మోడీ సర్కార్కు ముచ్చెమటలు
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
కల్వకుర్తిలో సమీకృత మార్కెట్కు శంకుస్థాపన, 38మందికి దళితబంధు యూనిట్ల పంపిణీ
పాల్గొన్న ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కశిరెడ్డి
బలమైన సామాజిక విప్లవానికి దళితబంధు నాంది పలుకుతుందని, దళితులు లబ్ధిదారులు కాదని ఇక నుంచి వారు హక్కుదారులని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో రూ.5 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్కు శంకుస్థాపన చేశారు. అనంతరం కల్వకుర్తి, వెల్దండ మండలాలకు చెందిన 38మంది లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లు పంపిణీ చేశారు. ఇకపై దేశ రాజకీయాల్లో దళితబంధు పథకం రాజకీయ ఎజెండాలో భాగంకాక తప్పదన్నారు.
కల్వకుర్తి, జూన్ 20 : బలమైన సామాజిక విప్లవాని కి దళితబంధు నాంది పలుకుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పేదలను ఆ ర్థిక, సామాజిక స్వతంత్రులను చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో కల్వకుర్తి ము న్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన సమీకృత మార్కెట్కు శంకుస్థాపన చేశారు. అనంతరం కల్వకుర్తి, వెల్దండ మండలాలకు చెందిన 38 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకం ద్వారా ట్రాక్టర్లు, ట్యాక్సీ కార్లు, గూడ్స్ క్యారియర్లను సోమవారం కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో పేదరికం ఉందని, దురదృష్టం ఏమిటంటే భారతదేశంలో అంటరానితనంతో కూడిన పేదరికం ఆర్థిక, సామాజిక అసమానతలకు కేంద్రీకృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సామాజిక అంతరాలు పెరిగితే సాంఘీక ఘర్షణకు తెరలేస్తుందని చెప్పారు. అందుకే ఈ అసమానతలను తగ్గించే విధంగా కార్యక్రమాలు ప్రవేశపెట్టామని గుర్తు చేశారు.
దళితబంధు ద్వారా దళితులకు కేవలం డబ్బు ఇవ్వడమే అనుకుంటే చాలా పొరపాటని మంత్రి పేర్కొన్నారు. ఇదో బృహత్తర కార్యక్రమం, సామాజిక విప్లవానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలు తగ్గితే కులాల అసమానతుల తగ్గి అందరూ ఒకటే అన్న భావం కలుగుతుందన్నారు. దళితబంధు పథకం దేశంలోనే రాజకీయ ఎజెండాలో భాగం కాక తప్పదన్నారు. కేంద్రంలోని 19రాష్టాల్లో బీజేపీ ప్రభుత్వాలపై దళితబంధు ప్రభావం ప్రస్పుటంగా కనిపిస్తుందన్నారు. అన్ని రాష్ర్టాల్లో దళితబంధు ఇవ్వక తప్పని పరిస్థితుల నేపథ్యంలో విపక్ష పార్టీలకు చెందిన నేతలు దళిత బంధుపై డబ్బులెక్కడివి అంటూ విమర్శలు ఎత్తుకున్నారని మంత్రి మండిపడ్డారు. తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాల వల్ల మోడీ సర్కార్కు ముచ్చేమటలు పడుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేస్తుందని మంత్రి మండిపడ్డారు. దళితబంధుకు దళితులు లబ్ధిదారులు కాదని ఇక నుంచి వారు హక్కుదారులని మంత్రి పేర్కొన్నారు.
కేంద్రం విధానాల వల్లే సంక్షోభం..
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్లనే వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం కల్వకుర్తి సమీపంలోని కేఎల్ఆర్ హాల్లో జిల్లా రైస్ మిల్లర్ల వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్సీ కశిరెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జెడ్పీ చైర్ పర్సన్ బాలాజీసింగ్తో కలిసి మంత్రి హాజరయ్యారు. వ్యవసాయ రంగం అభివృద్ధిపై కేంద్ర ప్రభుతానికి చిత్తశుద్ధి లేదన్నారు. మన కన్నా చిన్న దేశాలు వారి దేశాల్లో ఉత్పత్తి అవుతున్న ముడి సరుకుతో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నాయని చెప్పారు. వ్యవసాయ రంగంలో నిరంతర మార్పులు అవసరమని, ప్రపంచ దేశాల పోటీని తట్టుకుని అందుకు అనువైన ఉత్పత్తులను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిరంతరం కొత్త విధానాలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే విధంగా ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇందుకు సంబందించి ఇజ్రాయిల్ వ్యవసాయ విధానాన్ని, మొరాకో, ఎమిరేట్స్ దేశాల అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, జెడ్పీ వైస్ చైర్మర్ బాలాజీసింగ్, అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో రాంరెడ్డి, దళితబంధు ఈడీ రాంలాల్, జెడ్పీటీసీ భరత్ప్రసాద్, ఎంపీపీలు మనోహర, విజయ, వైస్ ఎంపీపీ గోవర్ధన్, పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్రెడ్డి, కౌన్సిలర్లు సూర్యప్రకాశ్రావు, తాసిల్దార్ రాంరెడ్డి, వైస్ చైర్మన్ షాహెద్, కిశోర్రెడ్డి, బావండ్ల మధు, బాలు, శ్రీను, జూలూరి రమేశ్బాబు పాల్గొన్నారు.