సమస్యలు ఉన్న ప్రతి రైతు నుంచి ఫిర్యాదు స్వీకరించాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
నాగర్కర్నూల్, జూలై 8: ధరణి పోర్టల్లో రైతు సమస్యలను పూర్తిగా తొలగించిన ఆదర్శవంతమైన భూసమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్న రైతు సదస్సులకు జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తాసిల్దార్లు రెవెన్యూ సదస్సు నిర్వహణ సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ లో పలు సూచనలు చేశారు. 15వ నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సుకు సంబంధిత ని యోజకవర్గ శాసనసభ్యులతో సమన్వయం చేసుకొని భూసమస్యలు ఉన్న ప్రతి రైతు రెవెన్యూ సదస్సులో తన ఫిర్యాదును అం దించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ముందుగా రెవెన్యూ అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఏ మండలంలో ఏయే గ్రామ పంచాయతీలకు ఎప్పుడు రెవెన్యూ సదస్సును నిర్వహించనున్నారో ప్రణాళిక సిద్ధం చేసుకొని అందుకు అనుగుణంగా ప్రజలను గ్రామాల్లో టాంటాం, పత్రిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు.
రెవెన్యూ సదస్సుకు ఒక పెద్ద హాల్ ఏర్పాటు చేసుకొని అందులో మౌలిక సదుపాయాలు కల్పించుకోవాలని సూచించారు. ప్రతి మండలం ప్రతి గ్రామం కవర్ చేసి సమస్య ఉన్న ప్రతి రైతు నుంచి దరఖాస్తు తీసుకొని అవసరమైన వాటిని అక్క డే పరిష్కరించడం, క్షేత్రస్థాయిలో రెవె న్యూ అధికారులను పరిశీలనకు పంపించి నివేదిక తీసుకొని పరిష్కరించుకోవడం వంటివి చేయాలన్నారు. రెవెన్యూ సదస్సు ద్వారా ఇప్పుడు ఉన్న భూసమస్యలు సాధారణమైన మేరకు తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. ధరణి పోర్టల్లో సమస్యలు పరిష్కరించేందుకు (టీ.ఎం33) సంఖ్యను 33 కు పెంచి వివిధ రకాలైన సమస్యలకు పరిష్కారం చూపేవిధంగా రూపొందించడం జరిగిందన్నారు. అంతకుముందు సీసీఎల్ఏ డైరెక్టర్ రజత్కుమార్శైని టీఎం 33పోర్టల్ గురించి పవర్పాయింట్ ద్వారా రెవెన్యూ అధికారులకు అవగాహన కల్పించారు.
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 20మండలాలు ఉన్నందున నాలుగు రెవె న్యూ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి గ్రామం కవర్అయ్యేవిధంగా షెడ్యూల్ తయారు చేసుకుంటామన్నారు. గ్రామాలు, మండలాల్లో టాంటాం వేయించి సమస్య ఉన్న ప్రతి రైతును సదస్సుకు వేచ్చ విధంగా చూస్తామన్నారు. రైతులకు అవగాహన కల్పించేందుకు ఫిర్యాదు చేయడంలో సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తామన్నారు. మొబైల్ మీసేవా కేంద్రాలను ఏర్పాటు చేసుకొని రైతు సదస్సుకు అందుబాటులో ఉం చుతామన్నారు. పెద్దహాల్ చూసి అవసరమైన మేరకు టేబుళ్లు ఏర్పాటు చేసుకోవ డం, తాగునీరు వంటి మౌలిక సదుపాయా లు ఏర్పాటు చేసుకుంటామన్నారు. మండలాల వారీగా ప్రణాళికలు చేసుకొని ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీడి యో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ మనూచౌదరి, అదనపు రెవెన్యూ కలెక్టర్ మోతీలాల్ నాయక్, ఆర్డీవోలు, తాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.