పెబ్బేరు, ఫిబ్రవరి 8 : రాజకీయాల్లో పదవులు శా శ్వతం కాదని.. చేసిన అభివృద్ధి పనులు శాశ్వతంగా నిలిచి పోతాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పెబ్బేరులో చౌడేశ్వరీ మాత జాతర సం దర్భంగా గురువారం ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీల ఫైనల్ మ్యాచ్ను ఆయన బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ అప్పటి సీఎం కేసీఆర్తో ప్రత్యేకంగా మాట్లాడి జూరా ల క్యాంప్ కాలనీలో అతి పెద్ద ఆట స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని రకాల ఆటలు ఆడేందుకు పనికివచ్చే శాశ్వత గ్రౌండ్గా దీన్ని తీర్చిదిద్దినట్లు చెప్పారు.
ఈ గ్రౌండ్ను అభివృద్ధి చేసి కాపాడే బాధ్య త మున్సిపల్ పాలకవర్గం తీసుకోవాలని సూచించా రు. భవిష్యత్తులో చేపట్టబోయే పనులకు తన సహకారం తప్పకుండా ఉంటుందని హామీ ఇచ్చారు. ము న్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్చైర్మన్ కర్రెస్వామి మాట్లాడుతూ మా జీ మంత్రి నిరంజన్రెడ్డి కృషి పట్టుదల వల్లే ఈ గ్రౌండ్ ఏర్పాటైందని, పెబ్బేరు చుట్టుపక్కల క్రీడాకారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. హనుమాన్, ఆజాద్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నాయకులు జగన్నా థం, వనం రాములు, దిలీప్రెడ్డి, బుచ్చారెడ్డితోపాటు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.