జడ్చర్ల, నవంబర్ 5 : పత్తికి అత్యధిక ధర పలికింది. గత బుధవారం రూ.8,400 పలికిన పత్తి.. శనివారం రూ.400 పెరిగి గరిష్ఠంగా రూ.8,801 ధర వచ్చింది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు 294 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా.. క్వింటాకు గరిష్ఠంగా రూ.8,801, కనిష్ఠంగా రూ.6,060, మధ్యస్తంగా రూ.8,389 ధర పలికింది.
180 క్వింటాళ్ల హంస రకం ధాన్యం అమ్మకానికి రాగా.. క్వింటాకు గరిష్ఠంగా రూ.1,909, కనిష్ఠంగా రూ.1,529, 156 క్వింటాళ్ల ఆర్ఎన్ఆర్ ధాన్యం రాగా.. క్వింటాకు గరిష్ఠంగా రూ.2,044, కనిష్ఠంగా రూ.1,826, 2,377 క్వింటాళ్ల మొక్కజొన్న రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.2,157, కనిష్ఠంగా రూ.1,641 ధర పలికింది. అలాగే రెండు క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్ఠంగా రూ.5,930, క్వింటా పెబ్బర్లు రాగా గరిష్ఠంగా రూ.5,121 ధరకు కొనుగోలు చేశారు.
కొల్లాపూర్, నవంబర్ 5 : స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం వ్యాపారులు టెం డర్ ద్వారా మొక్కజొన్నను కొనుగోలు చేశారు. క్వింటాకు గరిష్ఠంగా రూ.2,080, కనిష్ఠంగా రూ. 2036 ధర వచ్చింది. ఎనిమిది మంది రైతుల నుంచి 2,036 బస్తాలు కొనుగోలు చేసినట్లు మా ర్కెట్ కమిటీ చైర్మన్ కిషన్నాయక్ తెలిపారు.