గద్వాల రూరల్, మార్చి 28 : ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని గద్వాల ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా పల్లె దవాఖానలను ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్న ట్లు తెలిపారు. మంగళవారం మండలంలోని శెట్టి ఆత్మకూర్లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖానను ఆయన ప్రారంభించారు. అనంతరం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ముందుగా అం బేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ సర్కార్ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్య తె లంగాణగా మార్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. గ తంలో గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. సరైన సమయం లో వైద్య చికిత్సలు అందక ఎందరో మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయి న ఘటనలు కూడా ఉన్నాయన్నారు.
నే డు మంత్రి హరీశ్రావు నేతృత్వంలో స ర్కార్, పల్లె దవాఖానల్లో సూపర్గా వై ద్య సేవలు అందుతున్నాయని స్పష్టం చేశారు. అలాగే అంధత్వ నివారణే ధ్యే యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ప్రతి ఊళ్లో ప్రారంభిస్తున్నట్లు తె లిపారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్క రూ నేత్ర శిబిరాలను సద్వినియోగం చే సుకోవాలని సూచించారు. కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్గౌడ్, ఎంపీపీ ప్రతాప్గౌడ్, సర్పంచ్ శివమ ణి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రా ముడు, వైద్య సిబ్బంది, కార్యకర్తలు, నాయకుడు సంజీవులు పాల్గొన్నారు.