పాలమూరు, మార్చి 26 : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్ల రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని వంద ఎకరాల స్థలంలో హైకోర్టు నిర్మాణం చేపట్టడం సిగ్గు చేటని, బుధవారం జరిగే శంకుస్థాపనను అడ్డుకుంటామని పాలమూరు యూనివర్సిటీ బీఆర్ఎస్వీ కన్వీనర్ గడ్డం భరత్బాబు ప్రకటించారు. మంగళవా రం పీయూ ప్రధాన ద్వారం ఎదుట విద్యార్థులతో కలి సి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రకృతి సంపదను హైకోర్టు నిర్మాణం పేరుతో విచ్ఛి న్నం చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కడా స్థలం దొరకలేదా అని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసమే హైకోర్టును యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్నారని, కొన్ని నెలలుగా ఇక్కడ హైకోర్టు నిర్మాణాన్ని ఆపివేయాలని చేస్తున్న నిరసనలను పట్టించుకోకుండా రేపు హైకోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నారన్నా రు. శంకుస్థాపన కార్యక్రమాన్ని విద్యార్థులు, మేధావులు, ప్రజాసంఘాలు అందరూ వ్యతిరేకిస్తున్నా ప్ర భుత్వం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. ఏదేమైనా రేపు జరిగే శంకుస్థాపన పనులను తాము అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు మ హేశ్, పూర్ణచంద్రారావు, శివ, ఈశ్వర్, రవీందర్, సా యికుమార్నాయుడు, వెంకటలక్ష్మి, ఉమేశ్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.