నవాబ్పేట, అక్టోబర్ 10 : మండలంలోని పుట్టోనిపల్లితండా వాసుల దశాబ్దాల కల సాకారమైంది. దశాబ్దాల కాలంగా గతుకుల రోడ్డుపై నరకం అనుభవించిన తండావాసులకు ఇకపై అవస్థలు తప్పనున్నాయి. పోమాల జెడ్పీ రోడ్డు నుంచి పుట్టోనిపల్లితండాకు ఇటీవల బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. దీంతో తండావాసుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళ్తే మం డలంలోని పుట్టోనిపల్లితండా గతంలో పోమాల గ్రామ పం చాయతీకి అనుబంధంగా ఉండేది.
గతంలో తెలంగాణ ప్ర భుత్వం తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించిన సం దర్భంలో పుట్టోనిపల్లితండాను కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. కాగా అభివృద్ధికి ఆమడ దూరం లో ఉన్న తండాను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. తండాకు ప్రధాన సమస్యగా ఉన్న మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో మట్టి రోడ్డును బీటీగా మార్చేందుకు ఆరు నెలల కిందట రూ.కోటి68లక్షలు మంజూరు చేయించారు. పోమాల నుంచి పుట్టోనిపల్లితండాకు ఇటీవల బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. దీంతో తండావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో రోడ్డు వసతి సక్రమంగా లేక తండావాసులు మల్కాపూర్ మీదుగా సుమారు 3కిలో మీటర్లు అదనంగా ప్రయాణం చేసేవారు. పోమాల నుంచి పుట్టోనిపల్లితండాకు మట్టి రోడ్డు గతంలో నడకదారికి కూడా ఇబ్బంది కరంగా ఉండేది. ఇటీవల బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో తండావాసులతోపాటు తిమ్మయ్యపల్లి గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో నరకం కన్పించేది
పుట్టోనిపల్లితండా నుంచి పోమాల, నవాబ్పేట వెళ్లాలంటే గతంలో నర కం కన్పించేది. వర్షాకాలంలో నడకదారికి కూడా ఇబ్బంది కరంగా ఉండే ది. చాలాకాలంపాటు మల్కాపూర్ గ్రామం మీదుగా రాకపోకలు చేసేవా ళ్లం. ఇప్పుడు తండావాసులు బీటీ రోడ్డుపై హాయిగా ప్రయాణం సాగిస్తున్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతోనే బీటీరోడ్డు నిర్మాణం పూర్తయింది. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి, సీఎం కేసీఆర్కు తండావాసులు రుణపడి ఉంటాం.
– తరుణ్నాయక్, సర్పంచ్, పుట్టోనిపల్లి తండా
చాలా సంతోషమేస్తున్నది
పోమాల గ్రామం నుంచి పుట్టోనిపల్లితండాకు బీటీ రోడ్డు ఏర్పాటు చేయ డం చాలా సంతోషమేస్తుంది. గతం లో తండా నుంచి బయట గ్రామాల కు వెళ్లేందుకు నానా అవస్థలు పడేవా రం. మా తం డాకు రోడ్డు వేయించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.
– రేఖ్యానాయక్, పుట్టోనిపల్లితండా వాసి