మద్దూర్ (కొత్తపల్లి), జనవరి 26 : కొడంగల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ త్వ రలో ఖాళీ అవుతుందని కొడంగల్ ఎమ్మె ల్యే పట్నం నరేందర్రె డ్డి తెలిపారు. గురువా రం మండలంలోని రే నివెట్ల గ్రామానికి చెం దిన మాజీ సర్పంచ్ సాయమ్మ, 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సలీం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్కొక్కరిగా ‘చేయి’ని వీడి కారెక్కుతున్నారన్నారు. కాంగ్రె స్ పార్టీ ఉనికి కోల్పోతున్నదన్నారు. అభివృద్ధి కి అడ్డుపడకుండా పార్టీలకతీతంగా కలిసిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముచ్చట గా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రా వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, పీఎసీసీఎస్ చైర్మన్ జగదీశ్వర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటయ్య, వైస్ ప్రెసిడెం ట్ దాసు, నాయకులు హన్మిరెడ్డి, వీరేశ్గౌడ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.