జోగులాంబ గద్వాల : గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ( BRS ) అభ్యర్థినిని రీకౌంటింగ్లో (Recounting) కాంగ్రెస్ అభ్యర్థి ఓడించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎనిమిదో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి జయమ్మ ఒక ఓటుతో గెలిచింది .ప్రత్యర్థి రీకౌంటింగ్ చేయాలని కోరగా అధికారులు రీకౌంటింగ్ చేశారు .
ఈ లెక్కిపులో కాంగ్రెస్ అభ్యర్థికి ఒక ఓటు ఎక్కువగా రావడంతో తిరిగి రీకౌంటింగ్ జరుపాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల అధికారులను కోరారు. దీంతో వారు ససేమిరా అనడంతో బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు గౌడ్. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి హనుమంతు నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఓట్లు లెక్కింపులో ఇన్ వ్యాలిడిటీ ఓటును ఆర్వో లెక్కించి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే విధంగా అధికారులు ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ అభ్యర్థి ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే బీఆర్ఎస్ గెలిచిన స్థానాన్ని కాంగ్రెస్ గెలిచినట్టుగా ప్రకటించారని , ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వారు వెల్లడించారు.