బిజినేపల్లి, మార్చి 29 : మండల కేంద్రమైన బిజినేపల్లికి చెందిన మేస్త్రీ సంఘం సభ్యులతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆదివారం హైదరాబాద్లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నివాసం లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మర్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరం గా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. అధికార కాంగ్రె స్ పార్టీ చేస్తున్న అరాచకాలను గ్రామీణస్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు. ప్రతిని త్యం గ్రామాల్లో అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా ఇచ్చిన హామీలను నెరవేర్చక పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పార్టీలో చేరిన వారిలో శ్రీశైలం, రమేశ్, శివుడు, మధు, అంజీ, బాలపీరు, శ్రీశైలం, నర్సింహ, శ్యామ్, కృష్ణయ్య, జంగయ్య, ఆంజనేయులు, భగవంతు, రాజు, పర్వతాలు, తిరుపతయ్యలు ఉండగా కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు అల్లోజీ, చిరంజీవి, శివ, శ్రీశైలం తదితరులు ఉన్నారు.