మహబూబ్నగర్అర్బన్, డిసెంబర్ 6 : బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటానని, మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరై మార్గనిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునేలా ప్రవర్తించరాదన్నారు. కార్యకర్తలందరూ సం యమనం పాటించాలని సూచించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనన్నారు. మనం కరోనా సమయం లో కులమత భేదాలు లేకుండా ప్రజలందరికీ అన్ని విధాలా అండగా నిలిచామని గుర్తు చేశారు. మహబూబ్నగర్ జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేశామని వివరించారు. ప్రతి కార్యకర్తకు, ప్రజలకు 24గంటలు అందుబాటులో ఉంటాన ని, ఏ సమయంలో ఆపద వచ్చి తన తలుపు తట్టినా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ప్ర జలకిచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. మహబూబ్నగర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను త్వరలో పూర్తి చేయాలని లేనిచో తమ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్నయాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమా న్, వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, రవికుమార్తోపాటు కౌన్సిలర్లు తది తరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాతకు నివాళి
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, బడుగు బలహీన వర్గా ల కోసం ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయనను అందరూ ఆ దర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.