హన్వాడ, డిసెంబర్ 4 : మండలంలోని పల్లెమోనికాలనీ బీఆర్ఎస్ సర్పంచ్ వెంకటమ్మ భర్త పెద్ద వెంకన్నపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆదివారం రాత్రి దాడి చేశారు. సర్పంచ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా యెన్నం గెలుపొందిన సందర్భంగా సా యంత్రం పల్లెమోనికాలనీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సం బురాలు చేసుకుంటూ ర్యాలీగా వెళ్తుడంగా సర్పంచ్ భర్త పెద్ద వెంకన్న ఇంటి దగ్గర ఉండి సంబురాలను చూస్తుడంగా ఇదే కాలనీకి చెం దిన శ్రీకాంత్, శివకుమార్, రమేశ్ మా ఎమ్మెల్యే గెలిచారని ఎగతాళి చేయడంతోపాటు నానా బూతు మా టలు తిట్టి ఆయనపై అకారణంగా దాడి చేశారని తెలిపారు. అలాగే పక్కనే ఉన్న మరో బీఆర్ఎస్ కార్యకర్త ఆంజనేయులుపై కూడా దాడి చేయడంతో ఆయన తలకు గాయాలయ్యాయి. తమపై శ్రీకాంత్, శివకుమార్, రమేశ్ అకారణంగా దాడి చేయడంతో వారిపై చర్యలు తీసుకోవాలని హన్వాడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాపైదాడి చేసిన వారే ఓ గిరిజన వ్యక్తి నుంచి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఆరోపించారు. దీనిపై ఎస్సై రవినాయక్ను వివరణ కోరగా ఇద్దరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారని, మళ్లీ వారు కలిసి మాట్లాడుకుంటాం అని అన్నారని, లేనిచో విచారణ నిర్వహించిన కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
బీఆర్ఎస్ నాయకుల ఇండ్లపై కాంగ్రెస్ శ్రేణుల దాడులు
కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు గెలవడంతో హస్తం పార్టీ శ్రేణులు నియోజకవర్గంలో ఆదివారం రాత్రి పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఇండ్లపై దాడులకు పాల్పడ్డా డు. కొల్లాపూర్ మండలం సింగవట్నంలో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ వెళ్తుండగా, ఆ పక్క నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలైన శివ, బాలపీరు, రాముడు కారులో వెళ్తుండగా కాంగ్రె స్ కార్యకర్తలు కారుపై రాళ్లు విసిరారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కారు దిగివచ్చి కారుపై రాయి ఎందుకు వేశారని ప్రశ్నించగా, అందుకు ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యర్తలు రెచ్చిపోయి వారిని వెంటాడుతూ రాళ్లతో దాడిచేశారు. అలాగే పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్లో పోలింగ్ ముందు రోజు రాత్రి కత్తిపోటుకు గురైన, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు గుజ్జుల పరమేశ్ ఇంటిపై ఆదివారం రాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో చేసిన దాడిలో కిటికి అద్దాలు, ఇంటి గేటు ధ్వంసమైయ్యాయి. అలాగే విధంగా దేదినేనిపల్లి గ్రామంలో హస్తం పార్టీ శ్రేణులు రాత్రి విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తూ తాగినమైకంలో బీఆర్ఎస్ నా యకుడు మల్లేశ్(ఎంపీటీసీ భర్త)ఇంటిపై దాడి చేసి ప్రహరీని ధ్వంసం చేశారు. అదే గ్రామం లో శ్రీపతిరా వు ఇంటి కిటికీలు పగులగొట్టారు. అలాగే కురుమ కులానికి చెందిన భార్యాభర్తలను చితబాదడంతోపాటు వాల్మీకి కార్యకర్త ఇంటిపైనున్న ప్లాస్టిక్ కవర్ను లాగి నిప్పుపెట్టారు.