తాడూరు, సెప్టెంబర్ 24 : గతంలో ఇండ్లను, కుటుంబాలను వదిలేసి వలస వెళ్లిన రోజు కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడొచ్చి గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ఎవరూ నమ్మరని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. పదేండ్ల ప్రజా ప్రస్థానంలో మర్రి అన్న పాదయాత్రలో భాగంగా ఆదివారం తాడూరు మండలంలోని చర్లఇటిక్యాల, తుమ్మలసూర్, భలాన్పల్లి, ఐతోల్ గ్రామాల్లో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ హయాంలో వారు పెట్టిన గోసలు అంతా ఇంతా కావని, కరెంట్ అడిగితే కాల్చి చంపారన్నారు.
గతంలో వ్యవసాయానికి నీళ్లు లేవు, రైతులు పండించిన ధాన్యం కొనలేదు, పెట్టుబడి సాయం, రైతు చనిపోతే సాయం, విత్తనాలు, ఎరువులు అందేవి కావన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ సాగునీటికి తీ సుకొచ్చి రైతుబంధు, రైతుబీమా, ఎరువు, విత్తనాలు అందుబాటులోకి తీసుకొ చ్చి రైతును రాజు చేశారన్నా రు. రైతులు పండించి న పంటలను వారి కల్లాల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలకు మంచి చేయాలనే సోయి లేకుండా ఉన్నందునే నాగర్కర్నూల్కు మెడికల్ కళాశాల వస్తే అప్పటి నాయకులు అమ్ముకున్నారని, నేడు పట్టుబట్టి మెడికల్ కళాశాల తీసుకువచ్చానని తెలిపారు. అంబేద్కర్ సాక్షిగా ఈసారి గెలిస్తే ఇంజినీరింగ్ కళాశాల తెస్తానన్నారు.
తాడూరు మండలంలో దుందుభీ వాగుపై రెండు కిలోమీటర్లకు ఒక చెక్డ్యాం కట్టించానని, చర్లఇటిక్యాల నుంచి తుమ్మలసూర్కు కొత్తగా బీటీరోడ్డు వేయించినట్లు తెలిపారు. నన్ను ఎన్నికల్లో ఓడించేందుకు ఇద్దరు శత్రువులు ఏకమవుతున్నారని, వారికి డబ్బు బలం ఉంటే నాకు ప్రజల బలం ఉందన్నారు. ప్రభుత్వం తరఫునే కాకుండా సొం తంగా ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానని, ప్రజాసేవకే తన జీవితం అంకితమన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బైకని శ్రీనివాస్యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంతరావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యార రమేశ్, ఎంపీపీ శ్రీదేవి, వైస్ ఎంపీపీ శివలీల, సర్పంచులు శ్రీదేవి, రజిత, నాగరాజు, అశోక్కుమార్, ఇందుమతి, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు వెంకట్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ జైపాల్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.