మక్తల్, డిసెంబర్ 2 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లలో ఏం సాధించారని, ప్రజలకు ఏం ఒరగబెట్టారని మక్తల్లో విజయోత్సవ సంబురాలు జరుపుకొన్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్ రాజేందర్రెడ్డి , చిట్టెం రామ్మోహన్రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం మక్తల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం స్వగృహంలో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మక్తల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ సభ ప్రజలు లేక తుస్సుమందన్నారు.
ఈ ప్రభుత్వం ఎందు లో విజయం సాధించిందో ప్రజలకే అర్థం కావడం లేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో ఇరిగేషన్, విద్యావ్యవస్థను పటిష్టం చేశామని డొంక తిరుగుడు మాటలు మాట్లాడారని, కేసీఆర్ హయాంలో 85శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను మీ రెం డేండ్ల కాలంలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఎక్కడా ఒక్క తట్ట మట్టిని కూడా ఎత్తిందిలేదు.. కానీ ఇరిగేషన్ పనులు పూర్తి చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో 1, 10,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చామంటూ స్థానిక మంత్రి మాట్లాడడం చూస్తుంటే వీరు ఎవరికి నీళ్లు ఇచ్చారు.. అవి ఎక్కడికి పోయాయి.. కనీసం ఒక ఎకరాన్నైనా తడిపారా అని ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెం బడే కమీషన్ల కోసం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును జీవో నెంబర్ 69 పేరిట తెరమీదకు తీసుకొచ్చారన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వారి జేబులు నింపుకోవడానికి ప్రాజెక్టును కొత్తగా నిర్మిస్తున్నామని చెబుతున్నారు తప్ప ఈ ప్రాజెక్టుకు డీపీఆర్ అనుమతులు కూడా లేవన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదటగా రూ. 1600 కోట్లు అని, తర్వాత రూ.2800కోట్లు, ఆ తర్వాత రూ.4200 కోట్లు నిధులు కేటాయించామని, ప్రస్తుతం రూ. 5400 కోట్లు ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్నామని అనడం చూస్తుంటే వీరికి ప్రాజెక్టు నుంచి కమీషన్ ఎంతవరకు దోచుకోవాలనే ఆలోచన తప్పా మరి ఇంకేమీ లేదనిన్నారు. ప్రాజెక్టు కోసం కేవలం పైపులు మాత్రమే చూపించి బిల్లులు తీసుకుంటున్నారని ఆరోపించారు.
వానకాలం సీజన్లో రైతుల పండించిన పత్తిని మిల్లర్లు తీసుకోకపోతే రైతుల పక్షాన నిలబడిన మాజీ ఎమ్మెల్యేపై కేసు లు పెట్టించింది మీ ప్రభుత్వం కాదా? రైతులకు న్యాయం చేయమని అడిగే వారిపై కేసులు చేయడం మీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. గతంలో కొన్నటువంటి వడ్లకు రైతులకు రూ.1150 కోట్ల బోనస్ బకాయిలను అందించాలని, వాటి ఊసేత్తాకుండా రేవంత్ రెడ్డి ఇరిగేషన్, విద్యా వ్యవస్థ పూర్తి చేశామని అనడం ఎంతవరకు సమంజసంమన్నారు. మక్తల్ నియోజకవర్గంలో రూ.250 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ సూల్ నిర్మాణం చేస్తామని చెప్తున్నారు తప్పా ఆ నిర్మాణం ఎప్పుడో జరుగుతుందో వాళ్లకే తెలియదన్నారు.
ఇక మంత్రి వాకిటి శ్రీహరి రూ.210 కోట్లతో నారాయణపేట మక్తల్ రోడ్డును నాలుగు లేన్లుగా అభివృద్ధి చేస్తామని సభలో చెప్పారని, అది ఎప్పటిలోగా పూర్తి చేస్తారో కూడా చెప్పి ఉంటే బా గుండేదన్నారు. పాలమూరులో ఐఐఐటీ కాలేజీ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చెప్పే మాటలు చూస్తుంటే నవ్వు వస్తోందని, ఐఐఐటీకి అనుమతులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని కనీస పరిజ్ఞానం లేకుం డా ఓ సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడడం సిగ్గు చేటన్నారు. గత ప్రభుత్వంలో నారాయణపేటకు తీసుకు వచ్చినటువంటి అగ్రికల్చర్ కళాశాలను తీసుకువెళ్లి వనపర్తిలో పెట్టింది ఈ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఆలోచించుకొని ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని, అవేవీ నెరవేర్చకుండా రెండేళ్ల పాలన పూర్తయిన వేల విజయోత్సవాల పేరుట మరోసారి మోసం చేసేలా మాట్లాడితే ప్రజలు ఊరుకోరని, వారికి ఈ సారి తగిన బుద్ధి చెప్పడం ఖాయం అన్నా రు. సమావేశంలో నారాయణపేట జిల్లా రైతు బంధు సమితి మాజీ సభ్యురాలు చిట్టెం సరితారెడ్డి, నాయకులు కొత్త శ్రీనివాస్గుప్తా, రాజేశ్గౌడ్, చిన్న హనుమంతు, అన్వర్ హుస్సేన్, అశోక్రెడ్డి, బెల్లం శ్రీనివాస్రెడ్డి, మన్న న్, రంగప్ప, సాగర్ తదితరులు పాల్గొన్నారు.