మాగనూర్ : ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాల ప్రజలు నిరాశకు గురయ్యారని బీఆర్ఎస్ మాగనూర్ ( BRS Maganur ) మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి ( Yellareddy ) విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఎంపీవో కళ్యాణికి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సక్రమంగా అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో పంటలు ఎండిపోయే ప్రమాదం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని, ప్రస్తుతం కనీసం తొమ్మిది గంటలు కూడా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కావడం లేదని వారు ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్అధ్యక్షుడు వెంకట్రెడ్డి, సర్పంచులు రాఘవేందర్రెడ్డి, లక్ష్మప్ప, నర్సింహా, మాజీ సర్పంచులు మల్లారెడ్డి, పోస్ట్ అశోక్గౌడ్, సుతారి రవి, పల్లె మారెప్ప, పూల రాము, శంకర్గౌడ్, మొగులప్ప, శంక్రప్ప, శివరాం, చాలీమ్, గజపతి, జమీల్, బాలప్ప, వాకిటి రాజు, సాయప్ప తదితరులు పాల్గొన్నారు.