గద్వాల, జనవరి 6 : కేసీఆర్ ప్రభు త్వం ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడానికి కుట్రలు చేస్తున్నదని, ఆ పథకాలను యథావిధిగా కొనసాగించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి డిమాం డ్ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ బీఎం సంతోష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్తో మాట్లాడుతూ గద్వాల మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి లబ్ధిదారులను ఎంపిక చేశామని, ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చామని వారికే ఇండ్లు కేటాయించాలని కోరారు. గొర్రెల పథకంలో భాగంగా డీడీలు కట్టిన వారికి తక్షణమే గొర్రెలు అందించడంతోపాటు, దళితబంధు, బీసీ బంధు లబ్ధిదారులకు సాయం అందించాలని, కేసీఆర్ ప్రభుత్వం ఎంపిక చేసిన గృహలక్ష్మి లబ్ధిదారులకు వెంటనే సాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో నెంబర్ 354 కింద పట్టణానికి రూ.50 కోట్లు, ప్రతి పంచాయతీకి రూ.10లక్షల చొప్పున కేటాయిస్తూ నిధులు విడుదల చేశాడని వీటిని వినియోగించుటకు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. స్పం దించిన కలెక్టర్ పై విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పారు. అంతకుముందు నూతనంగా బాధ్యతలు తీసుకున్న కలెక్టర్ను ఎమ్మెల్యేతోపాటు ము న్సిపల్ చైర్మన్ కేశవ్ శాలువా కప్పి, బొకే అందించి సన్మానించారు. ఎమ్మెల్యే వెం ట ఎంపీపీలు ప్రతాప్గౌడ్, రాజారెడ్డి, విజయ్కుమార్, జెడ్పీటీసీలు పద్మావెంకటేశ్వర్రెడ్డి, శ్యామల, రాజశేఖర్, పీఏసీసీఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి, వైస్ చైర్మన్లు బాబర్, సుదర్శన్రెడ్డి, రామకృష్ణ, సర్పంచులు రఘువర్ధన్రెడ్డి, మహబూబ్, కౌన్సిలర్ మురళి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.