జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 29 : స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జడ్చర్లలో నిర్వహించిన అండర్-14 బా లుర విభాగం 67వ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో ఖమ్మం జట్టు విజేతగా నిలిచింది. రన్నర్గా రంగారెడ్డి, తృతీయ స్థానంలో మహబూబ్నగర్ జట్టు నిలిచింది. జడ్చర్లలోని మినీస్టేడియం మైదానంలో గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో రంగారెడ్డి జిల్లా జట్టుపై 36 పరుగులతో ఖమ్మం జట్టు విజయం సాధించింది. జడ్చ ర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి క్రీడాకారులను పరిచయం చే సుకొన్నారు. మొదటగా నిర్వహించిన సెమీ ఫైనల్ మ్యాచ్లో మొదటగా మహబూబ్నగర్, ఖమ్మం జట్లు తలపడగా, ఖమ్మం విజయం సాధించి ఫైనల్కు చేరిం ది. ఆ తరువాత రెండో సెమీఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్, రంగారెడ్డి జట్లు తలపడగా, రంగారెడ్డి జిల్లా జట్టు గెలిచి ఫైనల్కు చేరింది. హోరాహోరీగా కొనసాగిన ఫైనల్ మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు మొత్తం 15 ఓవర్లు ఆడి 5వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన రంగారెడ్డి జట్టు 15 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 86 పరుగులు మాత్రమే చేసింది.
ఖమ్మం జట్టు తరఫున బ్యాటింగ్లో కార్తీక్ 47 పరుగులు, సుఖేశ్ 22పరుగు లు చేయగా, బౌలింగ్లో శివం రెండు వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు చెరో ఒకటి చొప్పున వికెట్లు తీసి జట్టు విజయానికి కృషి చేశారు. ఫైనల్ మ్యాచ్లో బౌలింగ్ వి భాగంలో రంగారెడ్డి జట్టు క్రీడాకారుడు సుంఖిత్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీసి బౌలింగ్లో సత్తాను చా టాడు. అనంతరం గెలుపొందిన జట్లకు జడ్చర్ల తాసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంఈవో మంజులాదేవి బ హుమతులను ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయి క్రికెట్ పో టీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జాతీయస్థాయి టోర్నీలో ఆడేందుకు రాష్ట్ర జట్టును ఎంపిక చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో టోర్నీ పరిశీలకులు విద్యాసాగర్, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ రమేశ్బాబు, టోర్నీ ఆర్గనైజర్లు మోయిన్, విలియం, జాన్స న్, రాంచందర్, శారదాబాయి, క్రికెట్ జట్టు జిల్లా కోచ్ అబ్దుల్లా, ఎంపైర్లు మహేశ్, సూరి, ఉషాకిరణ్, ప్రకాశ్రాజ్, రాంలక్ష్మణ్, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.